అమలాపురంలో 2 ఆస్పత్రులకు భారీ ఫైన్‌!

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అధిక ఫీజులు వసూలు చేసిన రెండు ఆస్పత్రులకు అధికారులు భారీ జరిమానా విధించారు. ఆరోగ్యశ్రీ

Published : 23 May 2021 01:35 IST

అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అధిక ఫీజులు వసూలు చేసిన రెండు ఆస్పత్రులకు అధికారులు భారీ జరిమానా విధించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల నుంచి ఎక్కువ డబ్బు యాజమాన్యాలు వసూలు చేస్తున్నట్టు తెలియడంతో చర్యలు చేపట్టారు. ఆస్పత్రులకు రూ.7లక్షలు జరిమానా విధించినట్టు జేసీ కీర్తి చేకూరి వెల్లడించారు. 48గంటల్లోగా జరిమానా చెల్లించాలని ఆస్పత్రులను ఆదేశించినట్టు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని