Cyber Fraud: రూ.360 కోట్ల సైబర్ మోసం
దేశంలో మరో భారీ సైబర్ మోసం బయటపడింది. చైనా, హాంకాంక్కు చెందిన సైబర్ నేరగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం లాభాలను ఆశజూపి భారతీయుల నుంచి ఏకంగా రూ.360 కోట్లను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు....
డెహ్రాడూన్: దేశంలో మరో భారీ సైబర్ మోసం బయటపడింది. చైనా, హాంకాంగ్లకు చెందిన సైబర్ నేరగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం లాభాలను ఆశజూపి భారతీయుల నుంచి ఏకంగా రూ.360 కోట్లను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఉత్తరాఖండ్ ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసుల దర్యాప్తులో ఈ మోసం బయటపడింది. చైనా, హాంకాంగ్ దేశాలకు చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు ఓ మొబైల్ యాప్ రూపొందించారు. అందులో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మిన భారత్కు చెందిన అనేక మంది కోట్లాది రూపాయలను వీరు చెప్పిన ఖాతాలో జమ చేశారు. అలా చేరిన రూ.360 కోట్లను మోసగాళ్లు వివిధ ఆన్లైన్ మార్గాల ద్వారా చైనాలోని బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. అక్కడి నుంచి ఈ సొమ్ము ‘పవర్ బ్యాంక్’ యాప్ ద్వారా క్రిప్టో కరెన్సీలోకి చేరింది. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న మరికొన్ని యాప్లను దర్యాప్తు అధికారులు గుర్తించారు.
హాంకాంగ్ నేరగాళ్లకు సహాయం అందించారనే ఆరోపణలతో దేశంలోని ఇ-వ్యాలెట్ పేటీఎం, రేజర్పే ప్రతినిధులకు ఉత్తరాఖండ్ ప్రత్యేక టాస్క్ఫోర్స్ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఉత్తరాఖండ్లో ఇద్దరు కీలక నిందితులు సహా బెంగళూరులో నలుగురు, దిల్లీలో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ మోసంలో విదేశీయుల హస్తం ఉండటంతో సీబీఐ, ఐబీ, ఈడీ వంటి జాతీయ సంస్థలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి. అవసరమైతే అంతర్జాతీయ సంస్థల సహాయం కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.