Covid norms violation: ఆ ఎమ్మెల్యే కుమారుల పెళ్లికి 2వేల మంది అతిథులు
వివాహ వేడుకలో కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించిన ఓ ఎమ్మెల్యే ఇద్దరు కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.....
కేసు నమోదు చేసిన షోలాపూర్ పోలీసులు
పుణె: వివాహ వేడుకలో కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించిన ఓ ఎమ్మెల్యే ఇద్దరు కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బార్సి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే రాజేంద్ర రౌత్ తన ఇద్దరు కుమారులకు బార్సి పట్టణంలోని లక్ష్మీ సోపాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కమిటీ ఆవరణలో ఆదివారం వివాహం వేడుక నిర్వహించారు. ఓకే వేదికగా జరిగిన పెళ్లిళ్లకు పలువురు రాజకీయ ప్రముఖులు సహా 2000 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. దీంతో తొలుత ఈవెంట్ ఆర్గనైజర్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇద్దరు కుమారుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఎస్డీ గిరిగోశావి వెల్లడించారు. కొవిడ్ ఆంక్షలు అమలులో ఉండటంతో వివాహ వేడుకలకు కేవలం 50మంది వరకే అనుమతి ఉండగా.. ఎమ్మెల్యే కుమారుల పెళ్లిళ్లకు 2500 నుంచి 3వేల మంది వరకు హాజరైనట్టు పోలీసులు తెలిపారు. వీరిలో అనేకమంది మాస్క్లు కూడా ధరించలేదని తెలిపారు. ఈ వేడుకకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, ఇతర పార్టీల నేతలు కూడా హాజరయ్యారు.
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని భావిస్తున్న జనం కొవిడ్ నిబంధనల్ని గాలికొదిలేస్తున్నారు. మాస్క్లు ధరించకుండా బహిరంగంగా తిరగడమే కాకుండా ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా పెళ్లిళ్లు, సామాజిక కార్యక్రమాలకు హాజరవుతుండటంతో కొవిడ్ మళ్లీ డేంజర్ బెల్ మోగిస్తోంది. ఫలితంగా కేసులు మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా