థాయ్లాండ్లో ఘోర ప్రమాదం:17మంది మృతి
థాయ్లాండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ బస్సును రైలు ఢీకొట్టడంతో 17 మంది మృతి చెందారు. మరో 29 మంది వరకు గాయపడినట్లు...
మరో 29 మందికి గాయాలు
చాచియాంగ్సావో: థాయ్లాండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ బస్సును రైలు ఢీకొట్టడంతో 17 మంది మృతి చెందారు. మరో 29 మంది వరకు గాయపడినట్లు థాయ్ అధికారులు వెల్లడించారు. బ్యాంకాక్ నుంచి చాచియాంగ్ సావోలోని ఆలయం వద్దకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. 65 మందితో వెళ్తున్న పర్యాటక బస్సు రైల్వే ట్రాక్ను దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టినట్లు వివరించారు. వర్షం పడుతుండటంతో రైలు వస్తున్నట్లు బస్సు డ్రైవర్ గుర్తించకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించాయి.
రైల్వే ట్రాక్ల పక్కన మృతదేహాలు చెల్లాచెదురుగా పడి భయానక వాతావరణం నెలకొంది. రైలు ఢీకొనడంతో బస్సు తిరగబడిందని క్రేన్ సాయంతో యథాస్థితిలోకి తెచ్చినట్లు అధికారులు చెప్పారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. 2018లో డబ్ల్యూహెచ్వో లెక్కల ప్రకారం.. ప్రమాదాల వల్ల అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో థాయ్లాండ్ రెండో స్థానంలో నిలిచింది. ద్విచక్ర వాహనదారులు, బస్సు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతుంటారని పేర్కొంది. రెండేళ్ల కిందట చెట్టును బస్సు ఢీకొట్టిన ఘటనలో 18 మంది మృతి చెందగా.. పది మందికిపైగా గాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా