ఆపమంటే ఢీకొట్టి వెళ్లాడు..

రోడ్డు మరమ్మతులు చేస్తున్న కార్మికుడిని కంటైనర్‌ ఢీకొన్న ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. సదాశివనగర్‌ మండలం పద్మాజీవాడి శివారులోని జాతీయ రహదారిపై మరమ్మతులు నిర్వహిస్తున్న....

Published : 27 Dec 2020 01:35 IST

కామారెడ్డి: రోడ్డు మరమ్మతులు చేస్తున్న కార్మికుడిని కంటైనర్‌ ఢీకొన్న ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. సదాశివనగర్‌ మండలం పద్మాజీవాడి శివారులోని జాతీయ రహదారిపై మరమ్మతులు నిర్వహిస్తున్న కార్మికుడు అటుగా వస్తున్న కంటైనర్‌ను ఆపాలని కోరాడు. కానీ కంటైనర్‌ డ్రైవర్‌ ఆపకుండా తన వాహనంతో ఆ కార్మికుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో గాయపడ్డ  కార్మికుడిని చికిత్స నిమిత్తం మొదట కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లో చేర్పించారు. బాధితుడు వికారాబాద్‌ జిల్లా బానాపూర్‌కు చెందిన యాదప్పగా గుర్తించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆదిలాబాద్‌ కాల్పుల ఘటన.. జమీర్‌ మృతి
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని