కొవిడ్ వంకతో ప్రియురాలి చెంతకు
తనకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు భార్యకు అబద్ధం చెప్పిన భర్త
భార్యకు అబద్ధం చెప్పి భర్త నిర్వాకం
ముంబయి: తనకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు భార్యకు అబద్ధం చెప్పిన భర్త ప్రియురాలి దగ్గరకు చేరిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబయికి చెందిన వ్యక్తి జులై 21న తన భార్యకు ఫోన్ చేసి కరోనా వచ్చినట్లు చెప్పాడు. తాను ఇండోర్ వెళ్తున్నానని ఇక తనకు బతకాలని లేదని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. అతని బైకు, హెల్మెట్, పర్సును స్థానికంగా ఉండే వాషీ ఏరియాలో గుర్తించారు.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొవిడ్ కేర్ కేంద్రాలతో పాటు చాలా ప్రాంతాల్లో గాలించినా వ్యక్తి ఆచూకీ దొరకలేదు. సదరు వ్యక్తి చనిపోతానని చెప్పటం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేయటంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానించి మృతదేహం కోసం కూడా గాలించారు. ఎట్టకేలకు.. గత వారం కొవిడ్ పేరుతో మాయమైన వ్యక్తి తన పేరు, చిరునామా మార్చి ప్రియురాలితో కలిసి ఇండోర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు ముంబయి తీసుకొచ్చి భార్యకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిశ్చితార్థం రద్దు కావడంతో బాలిక తల నరికిన వరుడు
బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన వరుడు.. ఆమె తల నరికి హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె
ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వర్జిన్తండాలో చోటుచేసుకుంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం