ప్రాణాలకు తెగించి ఏటీఎం చోరీకి అడ్డుకట్ట

తమిళనాడు రామనాథపురంలో ఏటీఎం చోరీకి యత్నించిన ఓ దొంగను సెక్యూరిటీ గార్డు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు....

Published : 11 Dec 2020 14:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడు రామనాథపురంలో ఏటీఎం చోరీకి యత్నించిన ఓ దొంగను సెక్యూరిటీ గార్డు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు. రామన్‌చెట్‌ సమీపంలోని ఏటీఎంలోకి శిరస్త్రాణం ధరించి ప్రవేశించిన ఓ దొంగ సెక్యూరిటీ గార్డుపై ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. ఏటీఎం సెంటర్‌లోని విద్యుత్తు దీపాలు, సీసీ కెమెరాలు ఆపేయాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. దుండగుడు దాడి చేస్తున్నా ఏమాత్రం అధైర్యపడని సెక్యూరిటీగార్డ్‌ అతడి చేతిలోని రాడ్డును లాగేసుకున్నాడు. దొంగ ముఖం సీసీ కెమెరాల్లో కనిపించేలా అతడు ధరించిన హెల్మెట్‌ను కూడా లాగేశాడు. దీంతో భయపడ్డ దుండగుడు అక్కడినుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

ఇదీ చదవండి...

నిన్న చందానగర్‌.. నేడు వనస్థలిపురం!
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని