రోడ్లు శుభ్రపర్చమని పోలీసుకు షాకిచ్చిన కోర్టు!
కర్ణాటకలోని కలబురగి హైకోర్టు ఇటీవల ఓ పోలీసు అధికారికి షాకిచ్చింది. ఓ బాధితురాలి ఫిర్యాదు విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో బజార్ పీఎస్ స్టేషన్ అధికారి విఫలమైనందున.. ఆయనను వారం రోజుల పాటు రోడ్లు శుభ్రం చేయాలని ఆదేశించింది.
బెంగళూరు: కర్ణాటకలోని కలబురగి హైకోర్టు బెంచ్ ఇటీవల ఓ పోలీసు అధికారికి షాకిచ్చింది. ఓ బాధితురాలి ఫిర్యాదు విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పీఎస్ స్టేషన్ అధికారి నిర్లక్ష్యం ప్రదర్శించినందున.. ఆయనను వారం రోజుల పాటు రోడ్లు శుభ్రం చేయాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. కలబురగి తాలుకా, మినజ్గి తండాకు చెందిన తారాబాయి(55) అనే మహిళ కుమారుడు సురేష్ అక్టోబర్ 20న అదృశ్యమయ్యాడు. దీంతో ఆమె తన కుమారుడి జాడ వెతికి పెట్టాలంటూ బజార్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం కొద్ది రోజులకు తన కుమారుడిని వెతికిపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ను కోర్టులో దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సురేష్ను నవంబర్ 3న వెతికి పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.
ఈ క్రమంలో జస్టిస్ ఎస్ సునీల్దత్త యాదవ్, జస్టిస్ పీ రామకృష్ణ భట్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును మరోసారి పూర్తిగా పరిశీలించింది. బాధితురాలు ఫిర్యాదు చేసినపుడు ఆమె ఫిర్యాదుపై పోలీసులు తొలుత కనీసం స్టేషన్ డైరీలో గానీ, ఎఫ్ఐఆర్ నమోదు గానీ చేయకపోవడంపై సీరియస్గా పరిగణించింది. ఈ క్రమంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో విఫలమైన స్టేషన్ హౌజ్ అధికారిని వారం రోజుల పాటు పోలీసుస్టేషన్ ముందు రోడ్లు శుభ్రపరచవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పోలీస్స్టేషన్లలో ఇలాంటి చర్యల విషయంలో కాస్త దృష్టి సారించాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు చేసింది. అదేవిధంగా జీరో ఎఫ్ఐఆర్ అంశంపై జిల్లా పోలీసు అధికారులకు వర్క్షాప్ నిర్వహించాలని ఎస్పీకి సూచనలు చేసింది.
ఈ క్రమంలో కోర్టు ఆదేశాలపై ఎస్హెచ్వో స్పందిస్తూ.. ‘కోర్టు ఆదేశానుసారం.. స్టేషన్ ముందు రోడ్లు శుభ్రపరచడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు క్షమాపణలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా మరోసారి ఈ విధంగా వ్యవహరించనని కోర్టుకు విన్నవిస్తున్నా’ అని తెలిపారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ