US music festival: మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో తొక్కిసలాట.. ఎనిమిది మంది మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితులు, తొక్కిసలాట కారణంగా దాదాపు ఎనిమిది మంది మృతి చెందారు. దాదాపు 300కు పైగా గాయపడ్డారు! టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో...

Published : 07 Nov 2021 01:37 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని టెక్సాస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితులు, తొక్కిసలాట కారణంగా దాదాపు ఎనిమిది మంది మృతి చెందారు. దాదాపు 300కు పైగా గాయపడ్డారు! టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నిర్వహించిన ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘రాత్రి దాదాపు 9 గంటల సమయంలో ప్రేక్షకులంతా వేదిక వైపునకు దూసుకురావడం ప్రారంభించారు. ఇది అక్కడున్నవారిలో భయాందోళనలకు దారితీసింది.

ఈ క్రమంలో కొందరికి గాయాలు కావడం, మరికొందరు కిందపడిపోయి, అపస్మారక స్థితికి చేరుకోవడంతో.. పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటివరకు ఎనిమిది మంది మృతులను గుర్తించాం’ అని హ్యూస్టన్‌ ప్రధాన అగ్నిమాపక అధికారి శ్యామ్యూల్ పెనా వెల్లడించారు. మరో 17 మందిని ఆసుపత్రులకు తరలించగా.. వారిలో 11 మంది కార్డియక్‌ అరెస్ట్‌కు గురైనవారు ఉన్నారని చెప్పారు. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చేవరకు మరణాలకు కారణాన్ని నిర్ధారించలేమని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో దాదాపు 50 వేల మంది అక్కడున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనకు దారితీసిన కారణాలను అన్వేషిస్తున్నట్లు, అక్కడి వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు హ్యూస్టన్ పోలీసులు తెలిపారు. ఘటన నేపథ్యంలో మ్యూజిక్‌ ఫెస్టివల్‌ను రద్దు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని