TCS: వారంలో కనీసం 3 రోజులు కార్యాలయాలకు రావాల్సిందే!
వారంలో కనీసం 3 రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందని ఉద్యోగులకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తెలియజేసినట్లు సమాచారం. ఆ మేరకు ఉద్యోగులకు అంతర్గత మెయిల్ను పంపిందని సంబంధిత వర్గాల ద్వారా
ఉద్యోగులకు టీసీఎస్ వెల్లడి
ముంబయి: వారంలో కనీసం 3 రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందని ఉద్యోగులకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తెలియజేసినట్లు సమాచారం. ఆ మేరకు ఉద్యోగులకు అంతర్గత మెయిల్ను పంపిందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎప్పటి నుంచి ఇది అమలవుతుందో మెయిల్లో తెలపనప్పటికీ.. మరింత సమాచారం కోసం హెచ్ఆర్ మేనేజర్లను సంప్రదించాల్సిందిగా ఉద్యోగులకు సూచించిందని ఆ వర్గాలు చెప్పాయి.
‘కొవిడ్-19 పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేశాయి. అందుకే కార్యాలయాల నుంచి పనిచేయడాన్ని మనం ప్రారంభించాం. మన ఉన్నతోద్యోగులు ఇప్పటికే కార్యాలయాల నుంచి పనిచేస్తున్నారు. ఇక మన బృందాలు కూడా కార్యాలయాలకు రావాల్సిన సమయం వచ్చేసింది. రిటర్న్ టు ఆఫీస్లో భాగంగా.. కనీసం వారంలో 3 రోజులు మీరు ఆఫీసుకి రావాలి. ఇది తప్పనిసరి. మేము మీ హాజరునూ గమనిస్తుంటాం. ఎవరెవరు ఎప్పుడెప్పుడు రావాలనే సమాచారాన్ని మీకు సంబంధించిన మేనేజర్లు తెలియజేస్తారు. ఏమైనా సహకారం కావాలంటే మీ హెచ్ఆర్ బిజినెస్ పార్ట్నర్ను సంప్రదించండి’ అని ఉద్యోగులకు టీసీఎస్ పంపిన మెయిల్లో ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఇంతకుమునుపు సామాజిక మాధ్యమాలను కూడా టీసీఎస్ ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. అలాగే 2025 కల్లా కొత్త పని విధానాన్ని కూడా టీసీఎస్ అమలు చేయనుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. టీసీఎస్ 25*25గా వ్యవహరించే ఈ విధానం ప్రకారం.. ఏ సమయంలోనైనా కేవలం 25 శాతం మంది మాత్రమే ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేస్తారు. దీని వల్ల పని విధానంలో సమతౌల్యం రావడమే కాకుండా.. ఉద్యోగులకూ ఇల్లు, ఆఫీసు రెండింటి నుంచి పనిని ఆస్వాదించే అవకాశాన్ని కల్పించినట్లు అవుతుందని ఆ అధికారి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ