గోదాములకు గిరాకీ
దేశ వ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో గోదాముల అద్దె లావాదేవీలు గత ఆర్థిక సంవత్సరంలో 62 శాతం వృద్ధి కనిపించింది. మొత్తంగా 5.13 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలోని గోదాముల స్థలం అద్దెకు వెళ్లిందని స్థిరాస్తి
హైదరాబాద్లో 128% పెరిగిన అద్దె లావాదేవీలు
ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే ధోరణి
ఈనాడు, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో గోదాముల అద్దె లావాదేవీలు గత ఆర్థిక సంవత్సరంలో 62 శాతం వృద్ధి కనిపించింది. మొత్తంగా 5.13 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలోని గోదాముల స్థలం అద్దెకు వెళ్లిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ఫ్రాంక్ వెల్లడించింది. ప్రధానంగా థర్డ్పార్టీ లాజిస్టిక్ సంస్థలు, ఇ-కామర్స్ సంస్థల నుంచి గిరాకీ ఉందని ‘ఇండియా వేర్హౌసింగ్ మార్కెట్ రిపోర్ట్- 2022’లో వెల్లడించింది. హైదరాబాద్ రికార్డు స్థాయిలో 128 శాతం వృద్ధిని నమోదు చేసిందని పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 23.6లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అద్దెకు తీసుకోగా.. 2021-22లో 54లక్షల చదరపు అడుగుల్లో లీజింగ్ లావాదేవీలు జరిగాయి. ఇందులో మేడ్చల్లో దాదాపు 60 శాతం, శంషాబాద్ ప్రాంతంలో 30 శాతం స్థలాలు అద్దెకు వెళ్లాయి.
* దేశ రాజధాని దిల్లీలో 91 లక్షల చదరపు అడుగుల్లో గోదాముల అద్దె లావాదేవీలు జరిగాయి. ముంబయిలో 86 లక్షలు, పుణెలో 75 లక్షలు, బెంగళూరులో 59 లక్షలు, అహ్మదాబాద్లో 53 లక్షలు, చెన్నైలో 51 లక్షలు, కోల్కతాలో 43 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాముల స్థలం లీజింగ్కు వెళ్లింది. కొనుగోళ్లు, జీడీపీలో వృద్ధి కనిపిస్తుండటంతో గోదాముల అద్దె లావాదేవీలూ సానుకూలంగా సాగుతున్నాయని నైట్ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ తెలిపారు.
విశాఖలో...: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో గోదాముల అద్దె లావాదేవీలు 228 శాతం పెరిగాయని నైట్ఫ్రాంక్ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లావాదేవీలు జరగగా.. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో లక్ష చదరపు అడుగుల స్థలమే అద్దెకు వెళ్లిందని పేర్కొంది. ఇ-కామర్స్, థర్డ్ పార్టీ లాజిస్టిక్ సేవలను అందించే సంస్థల నుంచి గిరాకీ పెరిగిందని తెలిపింది. మొత్తం స్థలంలో గాజువాక- ఆటో నగర్ క్లస్టర్లో 87 శాతం అద్దెకు వెళ్లగా, మధురవాడ ప్రాంతంలో 13 శాతం లీజింగ్ లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు