బాండ్లలో లావాదేవీలు నిర్వహిస్తాం
ప్రధానంగా ఈక్విటీ మార్కెట్కు సేవలు అందిస్తూ వచ్చిన ఎన్ఎస్డీఎల్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) కొత్త ఉత్పత్తులు, సేవలపై దృష్టి సారించింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా బాండ్లు, ‘ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్’(ఈజీఆర్) వంటి కొత్త ఉత్పత్తులకు తన సేవలను విస్తరించనుంది
ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్లోనూ..
అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నాం
దేశంలో ఈక్విటీ పెట్టుబడుల సంస్కృతి పెరుగుతోంది
స్టాక్ మార్కెట్లో నమోదుపై అంకుర సంస్థల్లో ఆసక్తి
ఈనాడు ఇంటర్వ్యూ
ఎన్ఎస్డీఎల్ ఎండీ, సీఈఓ పద్మజ చుండూరు
ఈనాడు - హైదరాబాద్
ప్రధానంగా ఈక్విటీ మార్కెట్కు సేవలు అందిస్తూ వచ్చిన ఎన్ఎస్డీఎల్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) కొత్త ఉత్పత్తులు, సేవలపై దృష్టి సారించింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా బాండ్లు, ‘ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్’(ఈజీఆర్) వంటి కొత్త ఉత్పత్తులకు తన సేవలను విస్తరించనుంది. దీనికి తగిన సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్ఎస్డీఎల్ ఎండీ, సీఈఓ పద్మజ చుండూరు ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంటర్వ్యూ విశేషాలు
మీరు సుదీర్ఘకాలం పాటు బ్యాంకర్గా ఉన్నత స్థానాల్లో కొనసాగారు. ఇప్పుడు స్టాక్మార్కెట్లో కార్యకలాపాల్లో కీలకంగా ఉన్న ఎన్ఎస్డీఎల్లో ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మార్పు మీకెలా అనిపిస్తోంది.
ఎన్ఎస్డీఎల్లో గొప్ప మానవ వనరులు ఉన్నాయి. వారితో కలిసి పనిచేయటం వల్ల నాకు ఈ పని కొత్తదనే భావన రాలేదు. మన దేశంలో బ్యాంకింగ్ రంగంలో కొన్నేళ్ల క్రితం ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయో, అటువంటి వినూత్నమైన మార్పులు ఇప్పుడు స్టాక్మార్కెట్లలో కనిపిస్తున్నాయి. జామ్ (జనధన్, ఆధార్, మొబైల్)తో ఈ మార్పులు వస్తున్నాయని చెప్పాలి. దీనివల్ల బ్యాంకింగ్లో లావాదేవీలు, చెల్లింపులు అనూహ్యంగా పెరిగినట్లు, స్టాక్మార్కెట్లోనూ మదుపరుల సంఖ్య, లావాదేవీల పరిమాణం వేగంగా పెరుగుతోంది. ఎన్నో ఏళ్ల పాటు బ్యాంకింగ్ రంగంలో అన్ని రకాలైన మార్పులను చూసిన నాకు, ఎన్ఎస్డీఎల్లో సెక్యూరిటీల కార్యకలాపాలు పర్యవేక్షించడం ఆసక్తికరంగా ఉంది.
మీరు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ఎస్డీఎల్లో ఎటువంటి మార్పులు తీసుకువచ్చారు.
మనదేశంలో మొట్టమొదటి డిపాజిటరీ సేవల సంస్థ ఎన్ఎస్డీఎల్. డీమ్యాట్ అనే పదాన్ని సృష్టించిందే ఈ సంస్థ. గత పాతికేళ్లుగా కేపిటల్ మార్కెట్ల విస్తరణలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లోకి వచ్చే మదుపరుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తమ కష్టార్జితాన్ని తీసుకువచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. దీనికి తగినట్లుగా ఎన్ఎస్డీఎల్ స్పందిస్తోంది. ‘మార్కెట్ కా ఏకలవ్య’ అనే పేరుతో హిందీ, కొన్ని ప్రాంతీయ భాషల్లో మదుపరుల్లో అవగాహన పెంపొందిస్తున్నాం. మదుపరులకు ‘ద ఫైనాన్షియల్ కెలడోస్కోప్’ అనే పేరుతో నెలకోసారి న్యూస్ లెటర్ పంపిస్తున్నాం. ఇదే కాకుండా ఎన్ఎస్డీఎల్ సమర్థతను ఎన్నో రెట్లు పెంపొందించటం, తద్వారా మదుపరులకు మెరుగైన సేవలు అందించటం లక్ష్యంగా ‘ప్రోగ్రామ్- ఏపీటీ’ అనే మరొక కార్యక్రమాన్ని తీసుకున్నాం.
కొత్త సేవలు, ఉత్పత్తులు ఆవిష్కరించే ఆలోచన చేస్తున్నారా.
ఎన్ఎస్డీఎల్ ఇంత వరకూ ఈక్విటీకే పరిమితం కాగా, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బాండ్లు, ఎలక్ట్రానిక్ గోల్డ్రిసీట్స్(ఈజీఆర్) వంటి నూతన ఉత్పత్తులను అందించటానికి సిద్ధపడుతున్నాం. కొలేటరల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (సీఎంఎస్), డీఎల్టీ(బ్లాక్చైన్) ప్లాట్ఫామ్పై డిబెంచర్ సెక్యూరిటీ అండ్ కొవనాంట్ మానిటరింగ్ సిస్టమ్ను ఆవిష్కరించబోతున్నాం.
ఎన్ఎస్డీఎల్ పబ్లిక్ ఇష్యూకు రాబోతోందా.
ఆలోచన ఉంది. దీనిపై పని ప్రారంభించాం. సరైన సమయంలో పబ్లిక్ ఇష్యూకు వస్తాం.
మన దేశంలో ఈక్విటీ పెట్టుబడుల అలవాటు తక్కువ. ముఖ్యంగా రిటైల్ మదుపరుల్లో ఇటువంటి ఆలోచన లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మార్పు వస్తోందా.
తాజాగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10 కోట్లకు చేరుకుంది. గత రెండేళ్ల వ్యవధిలో కొత్తగా 4 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో మా వద్ద డీమ్యాట్ ఖాతాలు 127 శాతం పెరిగాయి. ‘ఈక్విటీ’ సంస్కృతి విస్తరిస్తోందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి. ముఖ్యంగా యువత ఈక్విటీ పెట్టుబడులపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మన ఆర్థిక వ్యవస్థ అకర్షణీయమైన వృద్ధి నమోదు చేస్తున్నందున పెట్టుబడి అవకాశాలు మున్ముందు ఎంతగానో పెరుగుతాయి. దీనికి అనుగుణంగా ఈక్విటీ పెట్టుబడులు ఇంకా పెరుగుతాయి.
అంకుర సంస్థలు స్టాక్మార్కెట్లో నమోదు కావటం, తద్వారా వృద్ధి అవకాశాల్లో మదుపరులకు భాగస్వామ్యం కల్పించడంపై మీ ఆలోచనలు ఏమిటి.
మనదేశంలో 78,000కు పైగా అంకుర సంస్థలు ఉన్నాయి. ‘యూనికార్న్’ల సంఖ్య 100కు మించిపోయింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇస్తున్న మద్దతు కారణంగా అంకుర సంస్థలు పెద్ద సంఖ్యలో మొదలై, విజయాలు సాధిస్తున్నాయి. ఎన్ఎస్డీఎల్లో ప్రస్తుతం కొన్ని ‘ప్రాసెస్’లను బలోపేతం చేయడంపై దృష్టి సారించాం. ఈ ప్రక్రియ పూర్తయితే, అంకుర సంస్థలకు అవసరమైన మద్దతును పూర్తిస్థాయిలో అందించగలుగుతాం.
కొన్ని దశాబ్దాలుగా అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు వృత్తి పరమైన బాధ్యతలను సమర్థంగా ఎలా నిర్వహిస్తున్నారు.
నేను పని విభజన, టీమ్ వర్క్ను విశ్వసిస్తాను. సానుకూల దృక్ఫథంతో వ్యవహరిస్తాను. నా విజయాల్లో నా కుటుంబం, నేను పని చేసిన సంస్థల్లోని సహచరుల పాత్ర ఎంతగానో ఉంది.
మీరు ఇండియన్ బ్యాంకు ఎండీ, సీఈఓగా ఉన్న సమయంలో అలహాబాద్ బ్యాంకు విలీన ప్రక్రియను చేపట్టి సమర్థంగా పూర్తిచేశారు. ఈ క్రమంలో ఎటువంటి సవాళ్లు ఎదుర్కొన్నారు.
ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంకుల మధ్య ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయి. విలీన ప్రక్రియ మొదలు కాగానే ‘కొవిడ్’ ముప్పు ముంచుకు వచ్చింది. దీంతో డిజిటల్ పద్దతిలో విలీన ప్రక్రియను కొనసాగించాల్సి వచ్చింది. దీన్ని సజావుగా పూర్తి చేయడంలో ఇండియన్ బ్యాంకు బృందం ఎంతో సమర్థంగా వ్యవహరించింది. తక్కువ సమయంలో వినియోగదార్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విలీన ప్రక్రియను ముగించింది. ఈ ప్రక్రియ ‘హార్వర్డ్ బిజినెస్ స్కూల్’ అధ్యయనాంశం(కేస్ స్టడీ)గా ఎంపిక అయిందంటే, ఎంత సమర్థంగా ఈ వ్యవహారాన్ని పూర్తి చేసిందీ అర్థం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా