కరోనా సమయంలో పెన్షన్దారులకు సులభమైన సేవలు
పింఛనుదారులు బ్యాంకు శాఖను సందర్శించకుండా ఇటువంటి సేవలను పొందగలుగుతారు.
లాక్డౌన్ సమయంలో, తరువాత రోజులలో సీనియర్ సిటిజన్ల జీవితాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలలో లాక్డౌన్ సమయంలో, ఆ ఆతర్వాత రోజుల్లో కూడా సీనియర్ సిటిజన్లు ఎలాంటి ఇబ్బందులు పడలేదని ప్రభుత్వం పేర్కొంది. క్లిష్టసమయాల్లో వారికి సులభలమైన సౌకర్యాలను కల్పించినట్లు తెలిపింది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా లాక్డౌన్ నుంచి పెన్షనర్ల సంక్షేమ శాఖ , పింఛనుదారుల కోసం సకాలంలో క్రెడిట్ పొందటానికి కోవిడ్-19 మహమ్మారి సమయంలో పెన్షన్, పదవీ విరమణ ప్రయోజనాలు సమయానికి అందేవిధంగా చర్యలు తీసుకుంది.
పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ తీసుకున్న కొన్ని చర్యలు :
1) పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) జారీ చేసినప్పటికీ, లాక్-డౌన్ కారణంగా సీపీఎస్ఓ లేదా బ్యాంకులకు పంపించని సందర్భాల్లో పింఛను సకాలంలో క్రెడిట్ అయ్యేలా, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, ఎలక్ట్రానిక్ మోడ్లను ఉపయోగించడానికి బ్యాంకుల సీపీఏఓ, సీపీపీలకు అవసరమైన ఆదేశాలను జారీ చేస్తుంది.
2) ఒక ఉద్యోగి బకాయిలను ఖరారు చేయడానికి ముందు పదవీ విరమణ చేసే అవకాశం ఉన్న చోట లేదా పెన్షన్ దావాను సమర్పించలేక పోయినా.. సీసీఎస్ (పెన్షన్) రూల్స్, 1972 లోని రూల్ 64, కోవిడ్-19 సమయంలో పింఛను ప్రయోజనాలను తక్షణమే తాత్కాలికంగా మంజూరు చేసేలా సడలించింది.
3) డిజి లాకర్తో ఈ-పీపీఓ (ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్) ను అనుసంధానించడానికి ఒక నిబంధన చేయబడింది. దీంతో డిజి -లాకర్లో పీపీఓ శాశ్వత రికార్డు ఉంటుంది. పెన్షనర్ అతని / ఆమె పీపీఓ తక్షణ కాపీని / ప్రింట్-అవుట్ పొందవచ్చు.
4) లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి గడువు పెంచారు. కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులందరూ ఫిబ్రవరి 28, 2021 వరకు దీన్ని సమర్పించవచ్చు.
5) లైఫ్ సర్టిఫికేట్లను డిజిటల్గా సమర్పించడానికి, పెన్షనర్లకు ఇంటింటికీ సదుపాయాలు కల్పించడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ముందుకు వచ్చింది. పింఛనుదారులు బ్యాంకు శాఖను సందర్శించకుండానే ఇంటి నుంచి ఇటువంటి సేవలను పొందగలుగుతారు.
6) దేశంలోని 100 ప్రధాన నగరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వినియోగదారుల కోసం డోర్ బ్యాంకింగ్ ప్రారంభమైంది. లైఫ్ సర్టిఫికెట్ల సేకరణ కూడా డోర్ స్టెప్ బ్యాంకింగ్ కిందకు వస్తుంది. లైఫ్ సర్టిఫికేట్ పొందటానికి వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ చేయమని బ్యాంకులను ఆదేశించారు.
7) ఇలాంటి క్లిష్ట కాలంలో పెన్షనర్ల భయం పోగొట్టేందుకు పెన్షనర్ల శాఖ అనేక వెబినార్లను నిర్వహించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.