Economy: కరోనా థర్డ్ వేవ్ వస్తే...
మహమ్మారి విజృంభణతో పరిస్థితి మరింత ప్రతికూలంగా మారితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.7 శాతంగా ఉండే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థ బర్క్లేస........
ఇంటర్నెట్ డెస్క్: మహమ్మారి విజృంభణతో పరిస్థితి మరింత ప్రతికూలంగా మారితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.7 శాతంగా ఉండే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థ బర్క్లేస్ అంచనా వేసింది. ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వచ్చి మరో ఎనిమిది వారాల పాటు లాక్డౌన్లు, కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తే మరో 42.6 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లొచ్చని తెలిపింది.
తాజాగా అమల్లో ఉన్న కఠిన ఆంక్షల వల్ల మే నెలలో వారానికి 8 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని బర్క్లేస్ గతంలోనే అంచనా వేసింది. ఏప్రిల్లో ఈ నష్టం వారానికి 5.3 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనే ఆర్థిక నష్టం అత్యధికంగా ఉండనున్నట్లు పేర్కొంది. జూన్ నుంచి పరిస్థితులు కాస్త చక్కబడే అవకాశం ఉందని తెలిపింది
‘‘అత్యంత ప్రతికూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే కరోనా మరోసారి విజృంభించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రెండు నెలల పాటు ఆంక్షలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మూడు, నాలుగు త్రైమాసికాల మధ్య భాగంలో ఈ పరిస్థితి తలెత్తొచ్చని భావిస్తున్నాం. దీంతో కరోనా మూలంగా తలెత్తిన ఆర్థిక నష్టం 117 బిలియన్ డాలర్లు.. జీడీపీలో 3.75 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నాం’’ అని బర్క్లేస్ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ రాహుల్ బజోరియా పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 9.2 శాతంగా బర్క్లేస్ అంచనా వేసింది. గతంలో దీన్ని 10 శాతంగా అంచనా వేసిన సంస్థ రెండో దశ విజృంభణ నేపథ్యంలో దాన్ని తగ్గించింది. ఇక ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 21.6 శాతంగా ఉంటుందని గతంలో పేర్కొన్న సంస్థ తాజాగా దాన్ని 15.4 శాతానికి సవరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు