Amit shah: అమరావతి ఉద్యమంలో పాల్గొనాల్సిందే
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమంలో పాల్గొనాల్సిందేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా భాజపా నాయకులకు తేల్చి చెప్పారు. భూములిచ్చిన రైతులు చేస్తున్న పోరాటానికి అనుకూలంగా
పొత్తులపై నిర్ణయించేది జాతీయ నాయకత్వమే
వైకాపా ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాడాలి
భాజపా నాయకులకు అమిత్షా దిశానిర్దేశం
ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్-తిరుపతి: రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమంలో పాల్గొనాల్సిందేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా భాజపా నాయకులకు తేల్చి చెప్పారు. భూములిచ్చిన రైతులు చేస్తున్న పోరాటానికి అనుకూలంగా పార్టీ తీర్మానం చేశాక దీనిపై మరో అభిప్రాయం ఎందుకొస్తోందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులపై రాష్ట్ర నాయకులెవరూ మాట్లాడకూడదంటూ గట్టిగా హెచ్చరించారు. దీనిపై సరైన సమయంలో కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజైన సోమవారం ఉదయం తిరుపతిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, సీనియర్ నేతలు పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సత్యకుమార్, సునీల్ థియోదర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర పార్టీ పనితీరును సమీక్షించారు. లోపాలను ప్రస్తావిస్తూ సరిచేసుకోవాలని గట్టిగా సూచించారు. అమరావతి ఉద్యమం గురించి సీనియర్ నేత ఒకరు ప్రస్తావించిన వెంటనే అమిత్షా మాట్లాడుతూ... పార్టీ తీర్మానం చేశాక వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మరో నాయకుడు జోక్యం చేసుకుని అది ఓ పార్టీ చేయిస్తోందని చెప్పడానికి ప్రయత్నించగా... ‘రైతులు భూములిచ్చారా? లేదా? ఉద్యమిస్తోంది రైతులా? కాదా? పాల్గొంటోంది రైతులే అయినప్పుడు అభ్యంతరం ఎందుకు? పాదయాత్రలో పాలుపంచుకోవాలి’ అని ఆదేశించినట్లు తెలిసింది. ‘పార్టీ బలోపేతం కావాలంటే చేరికలు తప్పనిసరి. ఒకసారి సభ్యత్వమిచ్చాక వారంతా మన కుటుంబ సభ్యులే. వారికి సముచిత స్థానం దక్కాల్సిందే. ఏవిషయంలోనూ వారిని దూరం పెట్టరాదు. ఉత్తరప్రదేశ్లో ఇతర పార్టీల నుంచి చేరిన వారిని సంస్థాగత నిర్మాణంలో భాగం చేశాం. అక్కడ పార్టీ బలంగా ఉండటానికి అదొక కారణం. అసోంలో హిమంత బిశ్వశర్మను పార్టీలో చేర్చుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రిని చేశాం’ అని ప్రస్తావించారు. ఇప్పటికీ కొందరు ప్రతిపక్ష తెదేపానే లక్ష్యంగా చేసుకుంటూ విమర్శించడం సరైంది కాదని అన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించాలని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సొంతగా కృషి చేయాలని అమిత్షా ఆదేశించారు. వైకాపాతో ఎలాంటి బంధం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడే రాష్ట్రంలో సుప్రీం అని, ఇతరుల ప్రభావానికి లోనుకావద్దని సూచించినట్లు పార్టీ వర్గాల కథనం. గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు జనవరిలో విశాఖ వస్తానని, మరోసారి భేటీ అవుదామన్నారు. రాష్ట్రంపై ఎలాంటి వివక్ష లేదని, విభజన చట్టంలో ఉన్నవన్నీ చేశామని, ఏమైనా మిగిలుంటే చేస్తామని అమిత్షా భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ప్లాంట్, గిరిజన వర్సిటీ, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై నివేదికను అందజేశారు. వైకాపాపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, వేగంగా ఆదరణ కోల్పోతోందని రాష్ట్ర నేతలు వివరించారు. అంతకుముందు అమిత్షా, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి సంతోష్లతో ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్లు విడిగా సమావేశమై రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై సుదీర్ఘంగా వివరించారు. ఒక పత్రిక, ఛానల్ని రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా నిషేధించడం సరైంది కాదని, ఎవరితో సంప్రదించి అలాంటి నిర్ణయం తీసుకున్నారని అమిత్షా ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, ఛానల్లో భేటీ సందర్భంగా ఘర్షణ జరిగిందని రాష్ట్ర నాయకుడు ప్రస్తావించగా... విమర్శలను సానుకూలంగా తీసుకోవాలని, భయపడే వారు నాయకులుగా ఎలా ఎదుగుతారని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!