Special status: నెరవేరని ప్రత్యేక హోదా హామీ
‘ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా’ అనే హామీతోనే రాష్ట్ర విభజన జరిగిందని, ఏళ్లు గడిచినా కీలకమైన ఆ హామీని కేంద్రం ఇప్పటికీ నెరవేర్చలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో గళమెత్తిన సీఎం జగన్
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
ఈనాడు, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా’ అనే హామీతోనే రాష్ట్ర విభజన జరిగిందని, ఏళ్లు గడిచినా కీలకమైన ఆ హామీని కేంద్రం ఇప్పటికీ నెరవేర్చలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ‘విభజన చట్టంలో పొందుపరచిన ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కట్టాలి. అయితే 2013-14 అంచనాల ప్రకారమే నిర్మాణానికి నిధులిస్తామని, మిగిలిన వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాలని చెప్పడమంటే.. అప్పుడిచ్చిన హామీని ఉల్లంఘించడమే. తాగునీటికి సంబంధించిన కాంపొనెంట్ నిధుల్ని కూడా విడుదల చేయకుండా తప్పుకోవాలని కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది’ అని విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా అధ్యక్షతన తిరుపతిలో ఆదివారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర పునర్విభజన బిల్లు-2014 ఆమోదం సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా.. ఇప్పటికీ వాటిని అమలు చేయకపోవడంతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది.’ అని వివరించారు. ‘దేశ సమగ్ర పురోగతికి కేంద్రం, రాష్ట్రాలతో పాటు.. అంతర్రాష్ట్ర సంబంధాల పరిపుష్టి కూడా ఎంతో ముఖ్యం. రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యలను నిర్ణీత వ్యవధిలో సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా మీ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయండి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్షాను కోరారు. ఈ సందర్భంగా జగన్ ఏడు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వీటిపై కేంద్ర ప్రభుత్వం అత్యవసర జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హాజరైన ప్రతినిధులు
పోలవరంపై కేంద్రానిది తప్పించుకునే ధోరణి
* 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉండటంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. అయినా 2013-14 నాటి వ్యయ అంచనా మేరకే నిధులిస్తామని కేంద్రం చెబుతోంది. సాగు, తాగునీటి సరఫరా పనులను కలిపే ప్రాజెక్టు ఖర్చులను నిర్ధారించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. పెరిగిన ప్రాజెక్టు వ్యయానికి అనుగుణంగా నిధులివ్వాలి.
* రాష్ట్ర విభజన నాటి (2014 జూన్ 2) నుంచి 2015 మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లుగా కాగ్ నివేదిక (2014-15) పేర్కొంది. కొత్తగా ‘ప్రామాణిక వ్యయం’ (స్టాండడైజ్డ్ ఎక్స్పెండిచర్) అన్న విధానాన్ని తెచ్చిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్కు కేవలం రూ.4,117.89 కోట్ల లోటు మాత్రమే పూడుస్తామని చెప్పింది. దీంతో మిగిలిన లోటు అలాగే ఉండిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా.. ఈ విషయంలో పునరాలోచించి సమస్య పరిష్కరించాలి.
* 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు విద్యుత్తు సరఫరాకు సంబంధించి రూ.6,112 కోట్లను తెలంగాణ ప్రభుత్వం బకాయి పెట్టింది. అప్పుడు ఆ రాష్ట్రానికి విద్యుత్తు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిన కేంద్రమే ఇప్పుడు సమస్యను పరిష్కరించాలి.
* బుందేల్ఖండ్ తరహాలో వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని పూర్తిగా అమలు చేయలేదు. షెడ్యూల్ 9, 10 జాబితాలో ఉన్న సంస్థలకు సంబంధించిన ఆస్తుల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లుగా అంచనా. వాటి పంపిణీ జరగకపోవడంతో ఆంధ్రప్రదేశ్ నష్టపోతోంది.
* ఇతర రాష్ట్రాల సహకారం లేకపోయినా.. పొరుగునే ఉన్న తమిళనాడు ప్రభుత్వం కోరినప్పుడల్లా చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నీటిని సరఫరా చేస్తోంది. దీనికి వసతుల కల్పన, నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణకు ఆ రాష్ట్రం నుంచి రావాల్సిన రూ.338.48 కోట్లను వీలైనంత త్వరగా ఇప్పించాలి.
* కుప్పం ప్రజలకు తాగునీరందించే పాలార్ ప్రాజెక్టు నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం మోకాలడ్డుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా నిల్వ చేసేది 0.6 టీఎంసీలే. ఇదే సమయంలో తమిళనాడు అవసరాల కోసం ఏడాదికి దాదాపు 10 టీఎంసీల నీరిస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాలార్ నిర్మాణానికి తమిళనాడు సహకరించేలా చూడాలి.
* గత ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి రుణాలు సేకరించారన్న కేంద్ర ఆర్థిక శాఖ.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బీఎంకు అనుగుణంగా నిర్ణయించిన రూ.42,472 కోట్ల నికర రుణ పరిమితిలో రూ.19,923.24 కోట్లు కోత విధించింది. గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు మా బాధ్యత లేదని మొరపెట్టుకున్నా వినలేదు. పైగా ఈ కోతను ఏకంగా మరో మూడేళ్లకు పొడిగించింది. అవేమీ గ్రాంట్లు కాదు. వివిధ అవసరాల కోసం సేకరిస్తున్న ఈ రుణాలను ప్రభుత్వం సక్రమంగా తీరుస్తోంది. అలాంటప్పుడు నికర రుణపరిమితిలో కోత విధించడం సరికాదు.
* ఆంధ్రప్రదేశ్ కంటే ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో.. ఇక్కడి కంటే కనీసం 10 శాతం ఎక్కువ మందికి కేంద్రం ద్వారా రేషన్ సరకులు ఇస్తున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 61 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41 శాతం మందికి మాత్రమే రేషన్ అందుతోంది. ఇది ఏ మాత్రం సరికాదు. జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో రాష్ట్రాలవారీగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో అసమానతలను తొలగించాలి’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా