Heavy Rain: పంటనష్టం రూ.3,300 కోట్లు
వరి ఊడ్చుకుపోయింది.. సెనగ పొలంలోనే కుళ్లిపోయింది.. పత్తి పూత, కాయ రాలిపోయింది.. ఇవే కాదు, మినుము, మొక్కజొన్న, చెరకు తదితర పంటలు వేల ఎకరాల్లో చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో సాగుదారులకు...
వర్షాలకు కుళ్లిపోతున్న వరి, సెనగ, మినుము పంటలు
నీరు నిలిచి మిరపకు దెబ్బ
కుంగిపోతున్న అన్నదాత
ఈనాడు, అమరావతి: వరి ఊడ్చుకుపోయింది.. సెనగ పొలంలోనే కుళ్లిపోయింది.. పత్తి పూత, కాయ రాలిపోయింది.. ఇవే కాదు, మినుము, మొక్కజొన్న, చెరకు తదితర పంటలు వేల ఎకరాల్లో చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో సాగుదారులకు కంటిమీద కునుకు కరవైంది. కదిలిస్తే చాలు కన్నీరు.. వరదై పారేలా ఉంది. నవంబరు నెలలో కురిసిన వానలకు ప్రభుత్వ అంచనాల ప్రకారమే 13 జిల్లాల్లో 13.24 లక్షల ఎకరాల్లో రూ.3,300 కోట్ల పంటనష్టం వాటిల్లింది. అంతకుముందు జూన్ నుంచి అక్టోబరు వరకూ జరిగిన నష్టమూ తక్కువేమీ కాదు. తొలకరిలో వేసిన పంట చేతికొచ్చే సమయంలో కుండపోత వానలకు అనంతపురం, చిత్తూరు జిల్లాలో లక్షల ఎకరాల్లో పశువుల మేతకూ పనికిరాని విధంగా దెబ్బతింది. మరోపక్క ఆశించిన వర్షాల్లేక కర్నూలు జిల్లాలో దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో గులాబ్ తుపాను ధాటికి వరితో పాటు ఇతర పంటలూ పాడయ్యాయి. వైరస్, తామరపురుగు మిరప మొక్కల్ని పీల్చివేస్తుండటంతో రైతులు పంటనే దున్నేస్తున్నారు. దెబ్బమీద దెబ్బలా నవంబరులో కురిసిన వానలు సాంతం ఊడ్చిపెట్టేశాయి.
అన్ని ప్రాంతాల్లోనూ అదే వ్యధ
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న వరి 6.10 లక్షల ఎకరాల్లో దెబ్బతింది. రైతులు ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టగా.. గింజ కూడా చేతికిరాని వారు లక్షల్లో ఉన్నారు. కడప, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల నేలవాలింది. రబీలో ప్రధాన పంటగా సాగయ్యే సెనగ నవంబరు మొదటి, రెండో వారంలో కురిసిన వానలకు కుళ్లిపోయింది. నవంబరు మూడో వారంలో ముంచెత్తిన వానలు, వరదలకు కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెనునష్టం సంభవించింది. వరి, సెనగ, మొక్కజొన్న, మిరప, మినుము, వేరుశనగ తదితరాలు అధికంగా దెబ్బతిన్నాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టినా రూపాయి కూడా చేతికి వచ్చేలా లేదని అన్నదాతలు వాపోతున్నారు.
సెనగ... రెండోసారి పెట్టుబడి
రబీలో వరి తర్వాత ప్రధాన పంట సెనగ. నవంబరులో కురిసిన వానలకు మొలక దశలోనే కుళ్లిపోయింది. సాగుకు ఎకరాకు రూ.10వేల వరకు ఖర్చయ్యింది. దీనికి ఇంకా ఈ-క్రాప్ కూడా నమోదుకాలేదు. కడప జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో విత్తనం వేశారు. పంటనష్టం కింద నమోదు చేయలేదని, బీమా వస్తుందో లేదోనని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం విత్తనాలను మాత్రమే రాయితీపై ఇస్తోంది. రైతులు మళ్లీ సెనగ వేసేందుకు రెండోసారి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.
పంటను దున్నేస్తున్నారు
మిరప సాగు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో అధికం. రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది సాగు పెరిగింది. రైతులు ఎకరాకు రూ.70వేల నుంచి రూ.90 వేల వరకు వెచ్చించారు. తెగుళ్ల నివారణకు పురుగు మందులు చల్లుతున్న దశలోనే వర్షాల కారణంగా దెబ్బతింది. అనంతపురం జిల్లాలోనే సుమారు 11వేల ఎకరాల వరకు పాడైనట్లు అంచనా. పలుచోట్ల పంటల్ని దున్నేస్తున్నారు.
రోజుల తరబడి తడవడంతో..
చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం తిరుమలరాజుపురం రైతు అన్నామలైరెడ్డి 1.50 ఎకరాల్లో వరి వేస్తే రూ.35 వేలు ఖర్చయ్యింది. వానలకు కోత దశలోని పైరు నేలవాలింది. రోజుల తరబడి తడవడంతో వడ్లు పొలంలోనే కుళ్లి, మొలకెత్తుతున్నాయని చెబుతున్నారు.
10లో ఆరెకరాలు వర్షార్పణం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతికి చెందిన వెంకటేశ్.. పది ఎకరాల్లో మిరప వేశారు. ఎకరాకు రూ.90వేల వరకు ఖర్చయింది. మొన్నటి వర్షం దెబ్బకు 80% పంట దెబ్బతింది. ‘ఆరెకరాల వరకు పోయినట్లే. విత్తనాలకే రూ.80 వేలు ఖర్చయింది’ అని వాపోయారు.
పైసా కూడా చేతికొచ్చేలా లేదు
నెల్లూరు జిల్లా కలిగిరికి చెందిన నరసింహారెడ్డి 13 ఎకరాల్లో మినుము వేస్తే.. వర్షాలకు పూర్తిగా పాడైపోయింది. ఎకరాకు రూ.13వేల పెట్టుబడి పెట్టారు. పైసా కూడా చేతికొచ్చేలా లేదని, రూ.1.50 లక్షల దాకా నష్టపోతున్నట్లు వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు