AP News: డీజీపీ ఆఫీసుకు ఎందుకు?
గుడివాడ కేసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్కు విన్నపమిచ్చేందుకు సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి బయల్దేరిన తెదేపా నాయకులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొల్లు రవీంద్ర తదితరులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.
పోలీసులపై నమ్మకం లేదంటున్నారు కదా
తెదేపా నాయకులను అడ్డుకున్న అదనపు ఎస్పీ, డీఎస్పీ
ఈనాడు, అమరావతి: గుడివాడ కేసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్కు విన్నపమిచ్చేందుకు సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి బయల్దేరిన తెదేపా నాయకులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొల్లు రవీంద్ర తదితరులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. వారు రాబోతున్నారని తెలుసుకుని తెదేపా కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీసుకు వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో ముందే మూసేశారు.
నాయకులను అడ్డుకుని అపాయింటుమెంట్ లేనిదే డీజీపీ కార్యాలయంలోకి వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. అపాయింటుమెంట్ అడిగామని, డీజీపీ నుంచి స్పందన లేదని, అందుకే నేరుగా బయల్దేరామని తెదేపా నేతలు చెప్పారు. డీజీపీ కాకపోతే.. అదనపు డీజీనైనా (శాంతిభద్రతలు) కలిసి వినతిపత్రమిచ్చేందుకు అనుమతించాలని కోరారు. దానికైనా అపాయింటుమెంట్ కావాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. తపాల్లో ఇచ్చి వెళతామన్నా అంగీకరించలేదు. ఇస్తే తమకివ్వాలని, లేదంటే తిరిగి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. పోనీ అదనపు ఎస్పీ తమను వెంటబెట్టుకుని వెళ్లాలని నేతలు కోరినా నిరాకరించారు. ప్రతిపక్షాలను ఇంత అవమానించకూడదని, రోడ్డుపై వినతిపత్రం తీసుకోవడమేంటని వర్ల ప్రశ్నించారు. మీకిస్తే డీజీపీకి విన్నపమిచ్చినట్టు ఎలా అవుతుందని నిలదీశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరినీ పంపవద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరిని పడితే వాళ్లను ఎలా పంపిస్తాం.. మీరు ప్రతిదాన్నీ ఇష్యూ చేయవద్దని డీఎస్పీ రాంబాబు వాగ్వాదానికి దిగారు. నిజనిర్ధారణ కమిటీలో ఉన్న ఆరుగురినైనా, కనీసం ముగ్గురినైనా పంపాలని విన్నవించినా ససేమిరా అన్నారు. దీంతో అక్కడే అదనపు ఎస్పీకి తెదేపా నేతలు విన్నపమిచ్చి అక్నాలెడ్జ్మెంటు తీసుకుని వెనుతిరిగారు.
‘పోలీసులపై నమ్మకం లేదంటున్నారు కాబట్టి డీజీపీ ఆఫీసుకు వెళ్లడానికి లేదని పోలీసులు అడ్డుకున్నారు. అంటే తెదేపావారికి పోలీసులు సేవలందించరా? మా పార్టీవారిని ఎవరైనా హతమార్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అంటారా? వీళ్ల వైఖరి చూస్తుంటే రేపు పోలీసు స్టేషన్లోకి కూడా రానిచ్చేలా లేరు’ అని విలేకరులతో మాట్లాడుతూ వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సెక్యూరిటీ జోన్లోకి అడుగు పెట్టేందుకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు.. పక్కనే ఉన్న తెదేపా కార్యాలయంపై దుండగులు దాడిచేస్తే ఏం చేశారని ఆలపాటి ధ్వజమెత్తారు. ఎస్సీ, బీసీ నాయకులను, మాజీ మంత్రులను డీజీపీ వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.
‘మీరు రోజూ ప్రతి అంశానికి డీజీపీని ముడిపెట్టి ఎలాబడితే అలా మాట్లాడుతున్నారు. మీ పార్టీ తరఫున డీజీపీకి లేఖలు రాస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే చేయండి. కానిస్టేబుల్నుంచి డీజీపీ వరకు పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టు మాట్లాడుతున్నారు కదా? మీకు డీజీపీ ఆఫీసుకు వెళ్లడానికి అపాయింటుమెంట్ లేదు. కావాలంటే ఆ వినతిపత్రం ఇక్కడే ఇచ్చి వెళ్లండి. మేం డీజీపీకి అందజేస్తాం’
-గుడివాడలో కేసినో వ్యవహారం, నిజనిర్ధారణకు వెళ్లిన పార్టీ నాయకులపై దాడికి సంబంధించి డీజీపీకి విన్నపమివ్వడానికి వెళ్లిన తెదేపా నాయకులతో గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ గంగాధరం వ్యాఖ్యలివి.
‘పోలీసులపై నమ్మకం లేదంటున్నారు కాబట్టి మిమ్మల్ని డీజీపీ ఆఫీసులో అడుగు పెట్టనివ్వబోమని కాగితంపై రాసివ్వండి. మరి కోడికత్తితో దాడి జరిగినప్పుడు ఈ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, ఇక్కడ కంప్లెయింటే ఇవ్వబోనన్న జగన్ మాటలు కూడా మీరు వినకూడదు కదా? ఆయన చెప్పినట్టు ఎలా పనిచేస్తున్నారు? అయినా పోలీసులపై నమ్మకం లేదని నేను ఎప్పుడూ అనలేదు. అడ్డగోలుగా మాట్లాడొద్దు.’
-తెదేపా నాయకుడు వర్ల రామయ్య స్పందన
‘పోలీసులపై నమ్మకం లేదని నేనన్నాను. గుడివాడలో తెదేపా నేతలపై జరిగిన దాడిపై డీఐజీని కలుస్తామంటే.. ఆయన ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో మారుమూలన ఉన్నానని, రావడానికి అర్ధరాత్రి అవుతుందని చెప్పారు. సాయంత్రం ఐదింటికి ప్రెస్మీట్ పెట్టి తెదేపావారు అరాచకం చేయడానికే వచ్చారని చెప్పారు. మాకు జరిగిన నష్టాన్ని తెలుసుకుని న్యాయం చేయాల్సిన అధికారులే ఇలా వ్యవహరిస్తే ఏమనాలి?’
- తెదేపా నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం