Sajjala: ఏ చిత్తశుద్ధి ఉందని చర్చించారు?
ఏ చిత్తశుద్ధి (శాంటిటీ) ఉందని ఇంతకుముందు చర్చించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులనుద్దేశించి వ్యాఖ్యానించారు. పీఆర్సీపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సచివాలయంలో సోమవారం సమావేశమైంది. అనంతరం సజ్జల విలేకరులతో మాట్లాడారు.
కమిటీని గుర్తించబోమనడం ప్రతిష్టంభన పెంచడమే
జీతాల బిల్లులు తయారుచేయబోమంటే క్రమశిక్షణ చర్యలే
ఉద్యోగ సంఘాలపై మండిపడ్డ ప్రభుత్వ సలహాదారు సజ్జల
ఈనాడు, అమరావతి: ఏ చిత్తశుద్ధి (శాంటిటీ) ఉందని ఇంతకుముందు చర్చించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులనుద్దేశించి వ్యాఖ్యానించారు. పీఆర్సీపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సచివాలయంలో సోమవారం సమావేశమైంది. అనంతరం సజ్జల విలేకరులతో మాట్లాడారు. మంత్రుల కమిటీకి ఏ చిత్తశుద్ధి ఉందని ఉద్యోగ సంఘాలు అడుగుతున్నాయన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ‘కమిటీకి ఏం అధికారం ఉందని అడుగుతున్నారంటే.. తీవ్రత (ఎస్ట్రీమ్)కు వెళ్లినట్లే. ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసిచ్చినా చర్చిస్తాం. జీతాల బిల్లులు తయారు చేయబోమనడం మెడపై కత్తి పెట్టడమే. దీని వల్ల నోటీసుకు, చర్చలకు అర్థం ఉండదు. ఈ విధంగా చేస్తే ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. ఉద్యోగులు ఇలాంటి ఆలోచన చేయడం కూడా సరైనది కాదు’ అని సజ్జల అన్నారు. ‘ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వస్తే మావైపు నుంచి ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాం. దీనిలో భాగంగా సోమవారం కమిటీ నిర్వహించే సమావేశానికి రావాలని సమాచారమిచ్చాం. ప్రభుత్వం నిర్ణయించిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే అవుతుంది. పీఆర్సీపై అనుమానాలుంటే కమిటీని అడిగి తెలుసుకోవచ్చు. పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. మంగళవారం కూడా చర్చలకు రమ్మని పిలుస్తాం. ఉద్యోగుల అంశంపై కమిటీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. చర్చలకు హాజరై.. సరిపోదు ఇంకొంచెం కావాలంటే ఉన్న పరిస్థితుల్లో ఎంత చేశామో చెబుతాం. ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే’ అని సజ్జల అన్నారు. ‘పీఆర్సీపై లక్ష రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ప్రచారం చేస్తున్నారు. ఉన్న పరిస్థితుల్లో ఇంత చేయగలిగామని ప్రభుత్వం ఆ రోజూ చెప్పింది. ఇప్పుడూ చెబుతోంది..’ అంటూ వాలంటీర్లతో ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వ సలహాదారు సమాధానమిచ్చారు. ‘ఉద్యోగులకు నష్టం జరిగిందని అన్నప్పుడు.. ప్రభుత్వం తరఫున ఏం చేశామో చెప్పడం తప్పెలా? అవుతుంది. ఉద్యోగులకు వ్యతిరేకంగా విష ప్రచారం చేయడం లేదు కదా?’ అని అన్నారు.
అధికారిక కమిటీ కాదని ఎలా చెబుతారు?: మంత్రి బొత్స
కమిటీతో చర్చలకు రావాలని జీఏడీ కార్యదర్శి ఉద్యోగ సంఘాలకు ఫోన్ చేసి చెప్పాక అధికారిక కమిటీ కాదని ఎలా చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగ సంఘాల నేతలనుద్దేశించి అన్నారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నందున సీరియస్ నిర్ణయం తీసుకోవద్దని చెబుతున్నామని పేర్కొన్నారు. కొవిడ్, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఉద్యోగులకు సూచిస్తున్నామని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు