బాబ్బాబూ.. టెండర్లు వేయండి!
పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరతంటూ నిత్యం గగ్గోలు పెడుతున్న పుర, నగరపాలక సంస్థలు కేంద్రం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. 2020-21 సంవత్సరానికి రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు కేంద్రం రెండు విడతలుగా కేటాయించిన
15వ ఆర్థిక సంఘం పనుల కోసం గుత్తేదారులకు అధికారుల వినతి
రెండేళ్లవుతున్నా అత్యధిక ప్రాంతాల్లో మొదలవని పనులు
పాత బిల్లుల పెండింగే కారణం
పుర, నగరపాలికల ఖాతాల్లో మూలుగుతున్న రూ.1,264 కోట్లు
ఈనాడు - అమరావతి
పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరతంటూ నిత్యం గగ్గోలు పెడుతున్న పుర, నగరపాలక సంస్థలు కేంద్రం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. 2020-21 సంవత్సరానికి రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు కేంద్రం రెండు విడతలుగా కేటాయించిన రూ.1,264 కోట్లు జమయి దాదాపు రెండేళ్లవుతున్నా ఇంకా ఖర్చు చేయలేదు. 2,3 సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు రావడం లేదని అధికారులు అంటున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తయిన పనులకు రూ.350 కోట్లకుపైగా బిల్లులు పెండింగులో ఉన్నాయి. వీటిని చెల్లించాలని గుత్తేదారులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో 15వ ఆర్థిక సంఘం పనులకు గుత్తేదారులు టెండర్లు వేయట్లేదు.
75% పనులకు టెండర్లు వేయలేదు
రాష్ట్రంలో పది లక్షలకు మించి జనాభా ఉన్న విశాఖపట్నం, విజయవాడ నగరపాలక సంస్థలకు 2020-21 సంవత్సరానికి రెండు విడతలుగా రూ.270 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. మిగిలిన నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు మరో రూ.994 కోట్లను కేంద్రం అందించింది. వీటితో పట్టణాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు ప్రారంభించి ఈపాటికే పూర్తి చేయాలి. ప్రతిపాదిత పనుల్లో 75 శాతానికి గుత్తేదారులు టెండర్లు వేయలేదు. కొన్ని నగరపాలక సంస్థల్లో ఉన్నతాధికారులు గుత్తేదారులను బుజ్జిగించి టెండర్లు వేయించినా పనులు ప్రారంభం కాలేదు. విజయవాడ నగరంలో రూ.66 కోట్లతో 55 పనులు ప్రతిపాదించారు. వీటిలో గతేడాది వ్యవధిలో 12 పనులకు టెండర్లు ఖరారు చేశారు. మిగతా పనులకు మూడోసారి మళ్లీ టెండర్లు పిలుస్తున్నారు. అనంతపురం నగరపాలక సంస్థలో రూ.7.50 కోట్ల పనుల్లో కొన్నింటికి మూడోసారి టెండర్లు పిలిచినా గుత్తేదారుల స్పందన లేదు.
ఆచరణకు నోచని మంత్రి ప్రకటనలు
సీఎఫ్ఎంఎస్తో సంబంధం లేకుండా పుర, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో చేయించిన పనులకు స్థానికంగా అధికారులు బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నామని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే అనేకసార్లు ప్రకటించారు. నిధుల వ్యయం నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఇతర ప్రభుత్వ శాఖల జోక్యం లేకుండా చూస్తామన్న ఆయన హామీలు ఆచరణకు నోచుకోలేదు. 14వ ఆర్థిక సంఘం నిధుల పనులకు సంబంధించిన బిల్లులు సీఎఫ్ఎంఎస్లో ఏడాదిన్నరగా పెండింగులో ఉన్నాయి. ఆ బిల్లుల చెల్లింపు మాటేమిటని గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ ఒకరు వాపోయారు.
చివర్లో తడిసిమోపెడు
ఐదేళ్లపాటు వరుసగా కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులన్నీ కలిపి చివరి ఏడాదిలో వెచ్చించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఏ ఏడాదిలో విడుదలైన నిధులు అదే ఏడాది ముగిసేలోగా వెచ్చిస్తే ఇబ్బంది ఉండదు. లేదంటే చివరి ఏడాదిలో పనులు తడిసి మోపెడై ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు 14వ ఆర్థిక సంఘం నిధుల్లో ఇప్పటికీ దాదాపు రూ.వేయి కోట్లు ఖర్చు కాలేదు. 2022 మార్చిలోగా వీటిని వినియోగించుకోనట్లయితే కేంద్రం వెనక్కి తీసుకోనుంది. నిధులు సకాలంలో ఖర్చు చేయకపోవడం, పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించనందున ఈ పరిస్థితి వచ్చింది. 15వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చు విషయంలోనూ నిర్దుష్ట కార్యాచరణతో ముందుకెళ్లాల్సి ఉందని పురపాలక కమిషనర్ ఒకరు అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.