RTPP: సీమ వెలుగులపై చిన్నచూపు
రాయలసీమ వెలుగుదివ్వెగా పేరొందిన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ) భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం ఆరు యూనిట్లున్న సంస్థలో ప్రస్తుతం మూడు యూనిట్లలో మాత్రమే విద్యుదుత్పత్తి చేస్తున్నారు.
ఆర్టీపీపీలో పూర్తిస్థాయి ఉత్పత్తి సాధ్యమేనా?
సంస్థ భవిష్యత్తుపై ఉద్యోగుల ఆందోళన
ఎర్రగుంట్ల, న్యూస్టుడే
రాయలసీమ వెలుగుదివ్వెగా పేరొందిన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ) భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం ఆరు యూనిట్లున్న సంస్థలో ప్రస్తుతం మూడు యూనిట్లలో మాత్రమే విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఏపీ జెన్కో పరిధిలోని మిగతా తాప విద్యుత్తు కేంద్రాల్లో సమస్య వస్తేనే ఉన్నతాధికారులు ఇక్కడినుంచి అధిక విద్యుదుత్పత్తిని కోరుకుంటున్నారు. ఇక్కడ ఉత్పత్తి వ్యయం అధికమవుతోందన్న నెపంతో ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని కార్మికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ మనుగడ, భవితవ్యంపై ఉద్యోగుల్లో క్రమేణా అపనమ్మకం ఏర్పడుతోంది. అనేకమంది ఉద్యోగులు డిప్యుటేషన్పై ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య తాప విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 25ఏళ్లపాటు ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించడం వారి ఆందోళనకు కారణమవుతోంది.
నాడు ఘనం... నేడు హీనం
రాయలసీమలో ఉపాధి, లోవోల్టోజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా తాప విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1988 మార్చి 18న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత 1991లో నిర్మాణ పనులు చేపట్టి 1995లో మొదటి యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించారు. కేంద్రం క్రమేణా అభివృద్ధి చెందుతూ మొత్తం 4దశల్లో ఏర్పాటుచేసిన ఆరు యూనిట్లలో 1,650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరింది. ప్రస్తుతం ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉందన్న నెపంతో వేల కోట్లు వెచ్చించిన ప్రాజెక్టును నామమాత్రంగా వినియోగిస్తున్నారు. ఏపీ జెన్కో పరిధిలోని మిగతా థర్మల్ కేంద్రాల్లో యూనిట్ ధర రూ.4లోపుంటే ఆర్టీపీపీలో రూ.5.50 వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీపీపీలో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉన్నందున థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించాల్సి వస్తే మొదటగా ఆర్టీపీపీ వైపే చూస్తున్నారు. దీంతో ఇక్కడ నామమాత్రంగా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేల కుటుంబాలు పరిశ్రమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నాయి. డిమాండ్ మేరకు ఉత్పత్తి చేస్తున్నామని కేంద్రం చీఫ్ ఇంజినీర్ మోహన్రావు తెలిపారు.
పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయాలి
వైకాపా ప్రభుత్వం వచ్చాక రెండున్నరేళ్లలో చాలా తక్కువ రోజులు మాత్రమే పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేశారు. దామోదరం సంజీవయ్య తాప విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ప్రైవేటుకు అప్పగించడంతో ఆర్టీపీపీ భవిష్యత్తుపై భయాందోళన పెరిగింది. లాభనష్టాలతో సంబంధం లేకుండా ఆర్టీపీపీలో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి చేయాలి. - రామగోపాల్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు (బీఎంఎస్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు