Covid Vaccine: బూస్టర్ తప్పనిసరి
ఏ టీకా అయినా రెండు డోసులు తీసుకున్న ఆర్నెల్ల తర్వాత తప్పనిసరిగా బూస్టర్ డోసు (మూడోడోసు) వేసుకోవాలని హైదరాబాద్లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్ డాక్టర్
మూడో డోసు టీకాను వెంటనే ప్రారంభించాలి
అప్పుడే దేశంలో మూడోదశకు అడ్డుకట్ట
‘ఈనాడు’ ముఖాముఖిలో ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి
అయితరాజు రంగారావు
ఈనాడు - హైదరాబాద్
ఏ టీకా అయినా రెండు డోసులు తీసుకున్న ఆర్నెల్ల తర్వాత తప్పనిసరిగా బూస్టర్ డోసు (మూడోడోసు) వేసుకోవాలని హైదరాబాద్లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. రెండుడోసులు ఇచ్చే ప్రక్రియను కొనసాగిస్తూనే.. బూస్టర్ డోసును ప్రారంభించాలని సూచించారు. అలా అయితేనే భారత్లో మూడోదశ ఉధ్ధృతిని నివారించవచ్చని తేల్చి చెప్పారు. మన దగ్గర ఇప్పటికీ డెల్టా కేసులే ఎక్కువగా వస్తున్నాయనీ, ఎక్కువగా జనాలు గుమిగూడిన సందర్భాల్లో వ్యాప్తి చెందిన కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. రెండు డోసుల టీకా పొందినా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దనీ, సత్వరమే పరీక్ష చేయించుకొని అవసరమైన చికిత్సను పొందాలని సూచించారు. ఐరోపా దేశాల్లో కేసులు మళ్లీ విజృంభించడం.. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోన్న నేపథ్యంలో ‘ఈనాడు’తో ముఖాముఖిలో ఆయన పలు అంశాలను వివరించారు.
ఐరోపా దేశాల్లో కొవిడ్ విజృంభిస్తోంది.. మన దగ్గర మూడోదశ ఉధ్ధృతికి ఇది ప్రమాద ఘంటికా?
ఐరోపా దేశాల్లో చలి వాతావరణం ఉండడంతో వైరస్ వ్యాప్తి ఒక కారణం కాగా.. అక్కడ 30 శాతం మంది ప్రజలు టీకా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. అందుకే ఆ పరిస్థితి నెలకొంది. భారత్లో రెండోదశ ఉద్ధృృతి సమయానికి టీకాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. కానీ ఇప్పుడు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అలా అని అతివిశ్వాసంతో ఉండకూడదు. కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినా, దక్షిణాఫ్రికా వేరియంట్ వచ్చినా.. ఆ ప్రభావం మనపై ఉండకూడదనుకుంటే అందరూ తప్పనిసరిగా రెండుడోసులు వేసుకోవాలి. కొవిషీల్డ్ టీకా వ్యవధిని 84 రోజుల నుంచి తగ్గించాలి. కొవాగ్జిన్ గానీ, కొవిషీల్డ్ గానీ 28 రోజుల వ్యవధి చాలు. 6 నెలల వ్యవధి అనంతరం బూస్టర్ డోసు కూడా తీసుకోవాలి. మూడో డోసును ఇవ్వడం ద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకురాకుండా అడ్డుకోవచ్చు.
బూస్టర్ డోసుపై శాస్త్రీయ అధ్యయనాలున్నాయా?
బూస్టర్ డోసుపై ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. అమెరికా, యూకే, ఫ్రెంచ్ ప్రభుత్వాలు కూడా బూస్టర్ డోసు తీసుకోవాలంటున్నాయి. చైనాలో ఇప్పటికే ఇస్తున్నారు. మూడోడోసు తీసుకున్న 6 నెలల తర్వాత కొవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందని ఇజ్రాయెల్ అధ్యయనం వెల్లడించింది. ప్రఖ్యాత వైద్య పత్రికలు ‘నేచర్’, ‘లాన్సెట్’లోనూ దీనిపై అధ్యయన పత్రాలను ప్రచురించారు. భారత్లోనూ ఐసీఎంఆర్ భువనేశ్వర్లో 600 మందిపై చేసిన ఒక అధ్యయనం వచ్చింది. రెండు డోసుల టీకా తీసుకున్న 6 నెలల తర్వాత యాంటీబాడీస్ తగ్గిపోతున్నట్లుగా ఈ అధ్యయనం పేర్కొంది.
* ఏఐజీలోనూ ఈ కోణంలో అధ్యయనం చేస్తున్నాం. దీని ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. 500 మంది రెండు డోసులు తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ బారినపడిన వారిని.. 600 మంది ఒక్క డోసు కూడా టీకా తీసుకోకుండా ఇన్ఫెక్షన్ సోకిన వారిని అధ్యయనం చేశాం.రెండు డోసులు పొందినవారిలోనూ 2 శాతం మంది తీవ్ర అనారోగ్యం బారినపడ్డారు. ఎందుకని లోతుగా విశ్లేషిస్తే.. వీరిలో యాంటీబాడీస్ స్థాయి చాలా స్వల్పంగా ఉంది. దీన్నిబట్టి బూస్టర్ డోసు అవసరమనేది స్పష్టమవుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా బూస్టర్ డోసును సిఫార్సు చేయలేదు కదా?
ప్రపంచంలోని అందరికీ రెండు డోసులు పూర్తయ్యే వరకూ ఇవ్వకూడదనే నియమంలో భాగంగానే బూస్టర్డోసుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాట్లాడడం లేదు. అయితే అమెరికా, యూకే వంటి దేశాలు డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను పాటించడం లేదు. తమ పౌరులకు ఏది లాభం చేకూరుతుందో అదే చేస్తున్నాయి. మనమూ వీలైనంత త్వరగా బూస్టర్ డోసు ప్రారంభించాలి.
ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలి?
రెండోడోసు తీసుకున్న 6-9 నెలల మధ్యలో వేసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
ఏ టీకాను బూస్టర్గా స్వీకరిస్తే మంచిది?
రెండు డోసులు ఏది స్వీకరించారో.. అదే తీసుకోవచ్చు. లేదా వేరేది కూడా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా యాంటీబాడీస్ చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. ఒకే రకమైన టీకాను మూడోడోసుగా తీసుకోవడం కంటే.. వేరే రకాన్ని బూస్టర్గా తీసుకుంటే ఇంకా మెరుగ్గా యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయని మా అధ్యయనంలో గుర్తించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు