Chandrababu: మద్యం డబ్బులతో.. సంక్షేమ పథకాలా?
ఇందుకూరుపేట, న్యూస్టుడే: ‘మద్యం తాగిన డబ్బుతో వచ్చే ఆదాయంతో.. సంక్షేమ పథకాలు అమలు చేయడమేంటి? నాన్న తాగితే పిల్లలకు అమ్మఒడి రావడమేంటి? పింఛన్లు ఇవ్వడమేంటి? ప్రజలను కష్టపెట్టేందుకు జగన్..
ఇసుక మాఫియా కోసం ప్రజల ప్రాణాలు పణం
నెల్లూరులో బాధితులకు చంద్రబాబు పరామర్శ
చంద్రబాబునాయుడికి తన ఇంట్లో పరిస్థితిని వివరిస్తున్న నెల్లూరు జిల్లా గంగపట్నం గ్రామ మహిళ
ఈనాడు, తిరుపతి, ఈనాడు డిజిటల్, నెల్లూరు: ఇందుకూరుపేట, న్యూస్టుడే: ‘మద్యం తాగిన డబ్బుతో వచ్చే ఆదాయంతో.. సంక్షేమ పథకాలు అమలు చేయడమేంటి? నాన్న తాగితే పిల్లలకు అమ్మఒడి రావడమేంటి? పింఛన్లు ఇవ్వడమేంటి? ప్రజలను కష్టపెట్టేందుకు జగన్.. ఇలాంటి కొత్త స్కీములు మరెన్నో తెస్తాడు. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని రాపూరు, గంగపట్నం గ్రామాల్లో, నెల్లూరు నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. గంగపట్నంలో కొట్టుకుపోయిన చెరువు కట్టలను, దెబ్బతిన్న ఇళ్లు, ఆక్వా చెరువులను పరిశీలించారు. బాధితుల ఇళ్లలోకి వెళ్లి పలకరించారు. ఇళ్లన్నీ బురదమయమయ్యాయని మహిళలు విలపించగా.. నేనున్నానని భరోసా ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాఫియాగా మారి ఇసుక దోచుకుంటున్నారని, చెన్నై, బెంగళూరుకు తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక తవ్వకాల కోసమే సోమశిల నుంచి దిగువకు నీళ్లు వదలకుండా ప్రజల ప్రాణాలు పణంగా పెట్టారని ఆరోపించారు.
ఇళ్లు బాగుచేయడం ఎంతసేపు?
‘ప్రభుత్వం తలచుకుంటే.. దెబ్బతిన్న 150 ఇళ్లకు మరమ్మతులు ఎంతసేపు? మొద్దు నిద్ర నటిస్తున్న ఈ ప్రభుత్వాన్ని తిట్టాలంటే సభ్యత అడ్డొస్తోంది. కష్టాలు తీర్చలేని ఈ ప్రభుత్వం మనకెందుకు? రూ.2 వేల పరిహారంలోనూ తెదేపా అనుకూలురకు ఇవ్వడం లేదు’ అని చంద్రబాబు మండిపడ్డారు. గంగపట్నంలో నష్టపోయిన కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రూ.5వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. 10 గంటల పాటు స్తంభంపై ఉన్న ఇద్దరి ప్రాణాలు కాపాడిన మత్స్యకారుడు సురేష్కు ట్రస్టు తరఫున ప్రోత్సహిస్తామన్నారు. వరదల్లో చనిపోయిన పాలిటెక్నిక్ విద్యార్థి దుగ్గి గోపి తల్లి నాగమణితో మాట్లాడిన బాబు.. రూ.లక్ష సాయం ప్రకటించారు.
నెల్లూరు జిల్లా గంగపట్నంలో గిరిజన కుటుంబాన్ని పరామర్శించి, పూరింట్లో నుంచి బయటకు వస్తున్న చంద్రబాబు
రూ.1కే ఇళ్ల రిజిస్ట్రేషన్
‘1983 నుంచి పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు, స్థలాలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడమేంటి? రిజిస్ట్రేషన్ కోసం ఎవరూ డబ్బు కట్టొద్దు. దీనిపై న్యాయపోరాటం చేద్దాం. తెదేపా అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లోనే దీన్ని రద్దుచేసి, రూ.1కే రిజిస్ట్రేషన్ చేసిస్తామ’ని బాబు హామీ ఇచ్చారు.
పరిహారం అందించే వరకు పోరాడుతాం
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 తుపాన్లు వచ్చాయి. ఇప్పటికీ నష్టపరిహారంపై విధివిధానాలు రూపొందించలేదని చంద్రబాబు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తాజా వరదలకు చనిపోయిన వ్యక్తికి రూ.25 లక్షలు, ఉపాధి కోల్పోయిన వారికి రూ.20 వేలు, స్వల్పంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.25 వేలు ఇవ్వాలి. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి. తోపుడు బండ్లు, చిరువ్యాపారులకు రూ.20 వేల పరిహారం, కోళ్ల పరిశ్రమలోని ఒక్కో కోడికి రూ.250, బ్రాయిలర్ కోడికి రూ.100, పౌల్ట్రీ షెడ్లు పూర్తిగా పోతే నిర్మించి ఇవ్వాల’ని డిమాండ్ చేశారు. ఈ విపత్తుపై పార్టీ తరఫున నిజనిర్ధారణ కమిటీ వేస్తామని స్పష్టం చేశారు. ‘రాష్ట్రం తన వద్దనున్న విపత్తు నిధి నుంచి ముందు ఖర్చుపెట్టి.. తర్వాత కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు. రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనావేసిన ప్రభుత్వం.. వంద కోట్లయినా విడుదల చేయలేదు. కేంద్రాన్ని రూ.వెయ్యి కోట్లు ఇవ్వమంటే ఎందుకిస్తారు? ఇదే అనుభవం లేకపోవడమంటే’ అని సీఎం జగన్ను విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రజల ఆర్తనాదాలు వినకుండా, అసెంబ్లీలో తన చుట్టూ చేరే వారి భజనలకు ఆనందిస్తున్నారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు