AP Elections: పరిషత్ పోరులో.. అధికార పార్టీ ఆధిక్యం
రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా మెజార్టీ స్థానాల్ని గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా చాలాచోట్ల గట్టి పోటీనిచ్చింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు
11 జడ్పీటీసీ స్థానాల్లో 8 వైకాపా.. 3 తెదేపా కైవసం
పలుచోట్ల విపక్షం గట్టిపోటీ
హిరమండలంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమారుడి ఓటమి
రాజధాని పరిధిలోని 2 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా గెలుపు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా మెజార్టీ స్థానాల్ని గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా చాలాచోట్ల గట్టి పోటీనిచ్చింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని మూడు స్థానాల్ని గెలుచుకుంది. మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. వైకాపా 8, తెదేపా 3 చోట్ల గెలిచాయి. 129 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా 85, తెదేపా 33 చొప్పున గెలుపొందాయి. జనసేన ఐదు, సీపీఎం రెండు, సీపీఐ, భాజపా ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. ఇద్దరు స్వతంత్రులు గెలిచారు.
ఎమ్మెల్యేలకు చుక్కెదురు
* వైకాపా ఎమ్మెల్యే రెడ్డిశాంతి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని హిరమండలం జడ్పీటీసీ స్థానంలో ఆమె కుమారుడు శ్రవణ్.. తెదేపా అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు చేతిలో 59 ఓట్ల తేడాతో ఓడిపోయారు. చెల్లని ఓట్లుగా పక్కనపెట్టిన 332 బ్యాలెట్ పత్రాల్ని మళ్లీ పరిశీలించి, లెక్కించాలని వైకాపా పట్టుబట్టింది. అయినా ఫలితం మారలేదు. బుచ్చిబాబు వంశధార ప్రాజెక్టు నిర్వాసితుడు.
* కృష్ణా జిల్లా పెడనలో వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్కు ఎదురుదెబ్బ తగిలింది. పెడన జడ్పీటీసీ స్థానంలో 658 ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థి అర్జా వెంకటనగేశ్ గెలుపొందారు. నగేశ్ విజయ డెయిరీలో డైరెక్టర్గా ఉన్నారు.
* గుంటూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం జడ్పీటీసీ స్థానాన్ని తెదేపా గెలుచుకుంది. అక్కడ తెదేపా అభ్యర్థి పారా హైమావతి 1,046 ఓట్ల ఆధిక్యం సాధించారు. బ్రహ్మనాయుడు, హైమావతి ఇద్దరూ వేల్పూరు గ్రామస్థులే. వైకాపా నాయకులు శావల్యాపురం ఎంపీపీ, కారుమంచి పీఏసీఎస్ అధ్యక్షుడిదీ అదే గ్రామం. తెదేపా అభ్యర్థిగా అప్పట్లో హైమావతి భర్త హైమారావు నామినేషన్ వేశారు. ఉపసంహరణకు ముందే ఆయన చనిపోవడంతో ఎన్నిక రద్దైంది. ఇప్పుడు హైమావతి పోటీచేసి ఘనవిజయం సాధించారు.
* రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో మూడు జడ్పీటీసీలకు ఎన్నికలు జరగ్గా.. రెండుచోట్ల వైకాపా, ఒకచోట తెదేపా గెలిచాయి.
ఎంపీటీసీ ఎన్నికల్లోనూ గట్టిపోటీ
* ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పలు స్థానాల్లో వైకాపా, తెదేపా అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో ప్రతిపక్షం గట్టి పోటీనిచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాలకు ఐదు, తూర్పుగోదావరి జిల్లాలో 21కి 6, అనంతపురం జిల్లాలో 16కు 6చోట్ల తెదేపా అభ్యర్థులు గెలిచారు.
* తూర్పుగోదావరి జిల్లాలో సీపీఎం రెండు, సీపీఐ ఒక ఎంపీటీసీ స్థానాల్ని గెలుచుకున్నాయి. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండి, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో కలసిన ఎటపాక మండలంలోని విస్సుపురంలో సీపీఎం, కృష్ణవరంలో సీపీఐ గెలుపొందాయి. వి.ఆర్.పురం మండలంలోని చిన్నమట్టపల్లెలో సీపీఎం గెలిచింది.
* విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని ఎ.వెంకంపేటలో భాజపా విజయం సాధించింది.
* గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఉన్న ఫిరంగిపురం మండలంలోని గుండాలపాడు, వేమవరం ఎంపీటీసీలను తెదేపా కైవసం చేసుకుంది. రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతం నుంచి వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తగ్గిన ఓట్లు.. ఏమైనట్లు?
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం రాంపురం ఎంపీటీసీ స్థానానికి పోలైన ఓట్ల కంటే.. బ్యాలెట్ పెట్టెల్లో తక్కువ ఓట్లు ఉన్నాయి. పోలింగ్ నాడు 2,251 ఓట్లు నమోదుకాగా, లెక్కింపులో ఆరు ఓట్లు తక్కువగా వచ్చాయి. ఓటర్లు బ్యాలెట్ పేపర్ను బాక్సులో వేయకుండా వెళ్లిపోవడం వల్లే తేడా వచ్చిందని ఎంపీడీవో శివశంకరప్ప తెలిపారు. అక్కడ తెదేపా అభ్యర్థి కె.పద్మావతి 55 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
లెక్కింపులో వివాదాలు
* నెల్లూరు జిల్లా కోట మండలం కోట-2 ఎంపీటీసీ స్థానంలో తెదేపా, వైకాపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. అధికారులు మరోసారి లెక్కించి, వైకాపాకు మూడు ఓట్ల ఆధిక్యం వచ్చినట్టు ప్రకటించారు.
* విశాఖ జిల్లా కె.కోటపాడు మండలంలోని దాలివలస ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి కొట్నాన అశోక్ 26 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. లెక్కింపులో తేడా జరిగిందంటూ తెదేపా నేతలు రీకౌంటింగ్ కోరారు. ఆర్వో తిరస్కరించడంతో.. గంటపాటు రాస్తారోకో చేశారు.
* చిత్తూరు జిల్లా గుడిపాల మండలం వసంతాపురం ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి విజయలక్ష్మి 16 ఓట్ల ఆధిక్యం సాధించారు. వైకాపా నాయకులు రీకౌంటింగ్కు పట్టుబట్టగా.. ఆర్వో అంగీకరించలేదు. జడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాలతో మళ్లీ ఓట్లు లెక్కించారు. తెదేపా అభ్యర్థి 15 ఓట్ల మెజార్టీ తేలింది.
* ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ ఎంపీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి పమిడిముక్కల శివకృష్ణకు 126 ఓట్ల మెజార్టీ వచ్చింది. వైకాపా అభ్యర్థి డిమాండ్ మేరకు రెండోసారి లెక్కించినా.. అదే ఫలితం వచ్చింది.
* పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం సత్యవోలు ఎంపీటీసీగా తెదేపా నుంచి నాగరాజు 26 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వైకాపా నాయకుల డిమాండ్తో రీకౌంటింగ్ చేయగా.. నాగరాజు మెజార్టీ 27కు పెరిగింది.
ఎన్నికల కోడ్ ఎత్తివేత
పురపాలక, పంచాయతీ, పరిషత్ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ను గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.
పరిషత్ ఎన్నికల ఫలితాలు
ఈనాడు, అమరావతి
ఎన్నిక జరిగిన జడ్పీటీసీ స్థానాలు: 11
వైకాపా గెలిచినవి: 8, ఆనందపురం(విశాఖపట్నం), పెనుగొండ(పశ్చిమగోదావరి), జి.కొండూరు, విస్సన్నపేట(కృష్ణా), బంగారుపాళ్యెం(చిత్తూరు), జమ్మలమడుగు(కడప), నంద్యాల(కర్నూలు), చిలమత్తూరు(అనంతపురం),
తెదేపా గెలిచినవి: 3, శావల్యపురం(గుంటూరు), హిరమండలం(శ్రీకాకుళం), పెడన(కృష్ణా)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM