Polavaram: కొండ జారింది
ఈ చిత్రంలో కనిపిస్తున్నది పోలవరం 64వ ప్యాకేజీలో భాగంగా మామిడిగొంది-తోటగొంది గ్రామాల మధ్యలో 800 మీటర్ల పొడవున కుడివైపు సొరంగంలో కొండ కూలిన ప్రాంతం. సాధారణంగా కొండ విరిగిపడటం చూస్తాం. ఇక్కడ మాత్రం సొరంగంలో దిగిపోయింది.
పోలవరం జంట సొరంగాల పనులకు అవరోధం
అనుబంధ పనుల్లో అపశ్రుతి
లైనింగ్ పనులు చేపట్టకపోవటమే సమస్య
ఈ చిత్రంలో కనిపిస్తున్నది పోలవరం 64వ ప్యాకేజీలో భాగంగా మామిడిగొంది-తోటగొంది గ్రామాల మధ్యలో 800 మీటర్ల పొడవున కుడివైపు సొరంగంలో కొండ కూలిన ప్రాంతం. సాధారణంగా కొండ విరిగిపడటం చూస్తాం. ఇక్కడ మాత్రం సొరంగంలో దిగిపోయింది. పోలవరం అనుబంధ పనుల్లో భాగంగా ఏర్పాటుచేస్తున్న జంట సొరంగాల మార్గంలోనే ఈ గొయ్యి ఏర్పడింది. దీని లోతు సుమారు 30 మీటర్లు. సొరంగాల లోపలి భాగం చుట్టూ లైనింగ్ పనులు చేయకపోవటంతో కొండ బరువుకు పైభాగం కుంగింది.
ఈనాడు డిజిటల్, ఏలూరు, పోలవరం, న్యూస్టుడే: పోలవరం ప్రాజెక్టు.. రాష్ట్ర ప్రజల కలల సౌధం. వచ్చే ఏడాది జూన్ 30నాటికి కుడి, ఎడమ కాలువలకు గ్రావిటీ ద్వారా నీరందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ప్రాజెక్టు ప్రధాన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతా అనుకూలంగా ఉందని భావిస్తున్న తరుణంలో జంట సొరంగాల్లో కుడివైపు భాగంలోని సొరంగంలో కొండ భాగం కూలింది. జంట సొరంగాల నిర్మాణం మొదలై పుష్కరం దాటినా నిర్మాణంలో జాప్యం, లైనింగ్ పనులు నిలిచిపోవటం, రెండు కొండల వాలు ప్రాంతంలో సొరంగ మార్గం ఉండటం తదితర కారణాలతో ఇలా జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో పెద్దగొయ్యి ఏర్పడింది.
కారణాలెన్నో..
సొరంగాల లోపలి భాగం చుట్టూ 80 సెం.మీ. మందంతో చేపట్టాల్సిన కాంక్రీట్ లైనింగ్ పనులు ఇప్పటివరకూ మొదలుకాలేదు. సొరంగాలకు రెండు వైపులా కొండలు ఉండటం వల్ల వర్షపు నీరు పైభాగంలో నిండుగా ప్రవహిస్తుంది. దీంతో సొరంగ ప్రాంతంలో క్రమేణా రంధ్రాలు పడటం, అది బలహీనపడటం, మరోవైపు కొండ బరువెక్కడం ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.
లైనింగ్ పనుల్లో పురోగతి లేదు..
లైనింగ్ పనులకు ఏడాది కిందటే అనుమతులు వచ్చినా పురోగతి లేదు. ప్రస్తుతం కొండవాలులోని నీరు ఇప్పటికి కూలిన భాగంలోకి చేరుతోంది. ఈ నీటి ద్వారా కొట్టుకొచ్చిన గ్రావెల్.. సొరంగం ముఖద్వారం వద్ద గుట్టగా కనిపిస్తోంది. అటువైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు సూచికలు ఏర్పాటుచేశారు. కొండచరియలు దాదాపు రెండు నెలల క్రితమే కూలినట్లు స్థానిక పశువుల కాపరులు చెబుతున్నారు. ప్రాజెక్టు వెనక భాగంలో నీటిని కుడి కాలువలకు తరలించేందుకు ఓ రెగ్యులేటర్తోపాటు జంట సొరంగాలను వినియోగిస్తారు. వీటి నిర్మాణం 2005లో ప్రారంభించారు. 64వ ప్యాకేజిలో భాగంగా మామిడిగొంది, తోటగొంది మధ్యలో 800 మీటర్ల పొడవునా తవ్వకం ప్రారంభించారు. అటవీ ప్రాంతంలో పర్యావరణ అనుమతులు లేవని 2006 మే నెలలో పనుల నిలిపివేతకు సుప్రీంకోర్టు ఉత్తర్వులనిచ్చింది. ఈ అనుమతులు లభించడంతో 2008 సెప్టెంబరులో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. అన్ని అవరోధాలను అధిగమించి సొరంగాలను నిర్మించారు. లైనింగ్ ఆకృతులకు ఏడాది కిందట అనుమతులు వచ్చాయి. 16 మీటర్ల వెడల్పున 20 మీటర్ల ఎత్తున సొరంగాలు తీశారు. వాటి అడుగుభాగాన బెడ్లెవెల్ కాంక్రీట్ను మాత్రమే వేయగలిగారు. లైనింగ్ పనులకు రేపుమాపంటూ కాలం నెట్టుకువస్తుండగా ప్రభుత్వం నీటి సామర్థ్యం పెంపునకు సొరంగాలను వెడల్పు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈలోగా సొరంగం పైభాగంలోని కొండ కూలింది.
బలహీన ప్రాంతం కావడంతో..
సొరంగ మార్గంలో గొయ్యి పడిన చోటు బలహీన ప్రాంతం. లైనింగ్ చేసేందుకు అనుమతులు వచ్చినా సొరంగాలను వెడల్పు చేయాల్సిన నేపథ్యంలో పనులు మొదలుపెట్టలేదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి మార్గదర్శకాల ప్రకారం గొయ్యి మరమ్మతు పనులు పది రోజుల్లో మొదలుపెడతాం.
-కె.బాలకృష్ణ, ఇన్ఛార్జి ప్రాజెక్టు అనుబంధ పనుల ఈఈ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు