Lakhimpur Kheri: మిగతా కేసుల్లోనూ నిందితులతో ఇలాగే వ్యవహరిస్తారా?
లఖింపుర్ ఖేరిలో గత ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 8 మంది మరణానికి కారణమైన నిందితుల పట్ల ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ వ్యవహారశైలి ఏమాత్రం సంతృప్తికరంగా లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.
యూపీ సర్కారు నుంచి మాటలే తప్ప చర్యలు లేవు
‘సిట్’లో అందరూ స్థానిక అధికారులేనా!
అన్నింటికీ సీబీఐ విచారణే పరిష్కారం కాదు
లఖింపుర్ ఖేరి కేసులో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
ఈనాడు, దిల్లీ: లఖింపుర్ ఖేరిలో గత ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 8 మంది మరణానికి కారణమైన నిందితుల పట్ల ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ వ్యవహారశైలి ఏమాత్రం సంతృప్తికరంగా లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ‘దయచేసి విచారణకు హాజరుకండి’ అంటూ నిందితుడికి సీఆర్పీసీ-160 కింద పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. మిగతా కేసుల్లోని నిందితుల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? అని నిలదీశారు. ఘటనలపై దర్యాప్తునకు పూర్తిగా స్థానిక అధికారులతోనే సిట్ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వారిని కొనసాగించే ప్రశ్నే లేదన్నారు. ఈ కేసులోని వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనుకోవడం లేదని, అన్నిటికీ సీబీఐ ఒక్కటే పరిష్కారం కాదని, మరే ఏజెన్సీతో విచారణ జరిపిస్తే బాగుంటుందో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీశ్సాల్వేకి సూచించారు. లఖింపుర్ ఖేరి ఉదంతంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థిస్తూ ఇద్దరు న్యాయవాదులు లేఖ రాయడంతో- ఈ అంశంపై జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో శుక్రవారం హరీశ్సాల్వే వాదనలు వినిపించారు. ‘‘నిందితుడిపై (కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్మిశ్ర కుమారుడు ఆశిష్) ఆరోపణలొచ్చాయి. కేసు తీవ్రత దృష్ట్యా ఆయనకు 160 కింద నోటీసులిచ్చి, విచారణకు పిలిచాం. సమయం కోరడంతో శనివారం ఉదయం 11 గంటలకల్లా రమ్మన్నాం’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇక్కడ చాలా గంభీరమైన అభియోగాలున్నాయి. ఎఫ్ఐఆర్లో 302, ఇతర సెక్షన్లు నమోదయ్యాయి. ఇలాంటి కేసులన్నింటి విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? మీకు నోటీసులు పంపుతున్నాం, దయచేసి హాజరుకండి అని మిగతా నిందితులనీ ఇలాగే అర్థిస్తారా?’’ అని ప్రశ్నించారు. సాల్వే బదులిస్తూ, ‘‘పోస్ట్మార్టంలో మృతునికి బుల్లెట్ గాయాలు కనిపించలేదు. అందుకే నిందితునికి 160 కింద నోటీసులిచ్చారు. బుల్లెట్ గాయముంటే పరిస్థితులు మరోలా ఉండేవి. కారును నడిపిన విధానంచూస్తే ఆరోపణలు నిజమేనని అనిపిస్తుంది. అందుకే ఇది 302 కేసు కిందికే వస్తుంది’’ అన్నారు. ఇందుకు సీజేఐ మాట్లాడుతూ- ‘‘నిందితుడి ప్రమేయం గురించి ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నారు కదా? మేము బాధ్యతాయుత ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను, వ్యవస్థను ఆశిస్తున్నాం. 302 కింద కేసు నమోదైనప్పుడు, మృతుడి శరీరంపై తుపాకీతో కాల్చిన గాయాలున్నప్పుడు ఈ దేశంలోని మిగతా నిందితులతోనూ ఇలాగే వ్యవహరిస్తారా? నోటీసులిచ్చి దయచేసి రండి అని అడుగుతారా? పోస్ట్మార్టం నివేదికలో బుల్లెట్ గాయాలు లేవని నిందితుడితో ఇలా వ్యవహరించవచ్చా? అత్యంత తీవ్రమైన కేసులో మీరు వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించలేదు’’ అన్నారు.
విచారణను 18వ తేదీకి వాయిదా వేయాలని, ఆలోగా కేసు విషయంలో అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని అత్యున్నతస్థాయి వర్గాలు చెప్పినట్టు సాల్వే కోర్టుకు విన్నవించారు. ఈ వ్యాఖ్యలతో సీజేఐ ఏకీభవించలేదు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం మాటల్లో తప్ప చేతల్లో చర్యలు కనిపించడంలేదు. సాధారణంగా 302 కింద కేసు నమోదుచేశాక పోలీసులు ఏం చేస్తారు? తక్షణం నిందితుడిని అదుపులోకి తీసుకుంటారు. ఇక్కడ మీరు నోటీసులిచ్చి, హాజరుకావాలని అడుగుతున్నారు’’ అని హరీశ్సాల్వేని ఉద్దేశించి సీజేఐ అన్నారు. జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుని, ‘‘ఇది 8 మంది దారుణహత్యకు సంబంధించిన కేసు. ఇందులో నిందితులు ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టం తనపని తాను చేసుకుపోయి, నిందితులందరిపై చర్యలు తీసుకొని ఉండాల్సింది’’ అని అన్నారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు.
సిట్లో వారు వద్దే వద్దు..
జస్టిస్ రమణ మాట్లాడుతూ- ‘‘ఘటనపై వేసిన సిట్ జాబితా చూశాం. అందులో డీఐజీ, ఎస్పీలు, సర్కిల్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లను నియమించారు. వీరంతా స్థానికులు కాబట్టే ఇలా జరుగుతోంది. కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందా?’’ అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ అలా కోరలేదని సాల్వే చెప్పారు. కేసు విచారణను దసరా సెలవుల వరకూ వాయిదా వేయాలని, కావాలంటే అప్పుడు సీబీఐకి అప్పగించాలని.. ఆలోగా ప్రస్తుత కార్యాచరణను కొనసాగనివ్వాలని.. లేకుంటే దర్యాప్తు జాప్యమవుతుందని కోర్టుకు విన్నవించారు. ఇందుకు సీజేఐ స్పందిస్తూ- ‘‘కేసు గంభీరతను బట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. అన్నింటికీ సీబీఐ విచారణే పరిష్కారం కాదు. అందుకు కారణమేంటన్నది మీకే బాగా తెలుసు. కేసుతో సంబంధమున్న వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని, మేం కూడా సీబీఐ విచారణ పట్ల ఆసక్తి చూపడం లేదు. సిట్ అధికారులను కొనసాగించే ప్రశ్నే లేదు. రెండుమూడు రోజుల నుంచి వారి ప్రవర్తన చూస్తున్నాం. దర్యాప్తు సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదు. మరేదైనా ఏజెన్సీ దర్యాప్తు చేపట్టేలోగా... సాక్ష్యాధారాలను పూర్తిగా ధ్వంసంచేసే పరిస్థితి రాకూడదు. అన్ని సాక్ష్యాధారాలను కచ్చితంగా సంరక్షించాలని డీజీపీకి చెప్పండి’’ అని ఆదేశించారు. అందుకు సాల్వే అంగీకరించారు. హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు తానే ఈ విషయం చెప్పి, న్యాయస్థానం ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని కోరతానన్నారు.
వారికి కొంతైనా స్పృహ ఉండాలి
టైమ్స్నౌ ట్వీట్పై సీజేఐ స్పందన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లఖ్నవూ వెళ్లి, లఖింపుర్ ఖేరి బాధిత కుటుంబాలను కలిశారంటూ టౌమ్స్నౌ ఛానల్ ట్విట్టర్లో పేర్కొనడం పట్ల సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రచారం చేసినవారికి కొంతైనా స్పృహ(సెన్స్) ఉండాలన్నారు. తాను కోర్టులో కూర్చొని ఉంటే, లఖ్నవూ వెళ్లి బాధితులను ఎలా కలుస్తానన్నది వారికే తెలియాలన్నారు. విచారణ సందర్భంగా ఆదిత్య అనే యువ న్యాయవాది ఈ ట్వీట్ విషయమై ప్రస్తావించారు. ఇందుకు సీజేఐ స్పందిస్తూ- ‘‘ఇలాంటి వాటి గురించి నేనేమీ మాట్లాడదలచుకోలేదు. ఇవన్నీ టీవీలు చేసే ప్రచారం. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిస్టర్ ఆదిత్యా! ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం పూలు, రాళ్లు రెండూ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని నవ్వుతూ అన్నారు. ప్రైవేటు జీవితాలను కూడా వదిలి పెట్టడంలేదన్న వ్యాఖ్యతో ఆయన ఏకీభవించారు. జస్టిస్ సూర్యకాంత్ మాత్రం ట్వీట్పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. కొందరు భావప్రకటన స్వేచ్ఛ హద్దులను దాటడం బాధాకరం. ట్వీట్లోని అంశాలు పూర్తిగా అవాస్తవం. ఈ విషయంలో ప్రధాన న్యాయమూర్తి గౌరవప్రదంగా వ్యవహరించారు. కానీ, ఇది పూర్తిగా కోర్టు ధిక్కారం కిందికే వస్తుంది. ట్వీట్కు బాధ్యులైనవారు తప్పు ఎందుకు జరిగిందో చెబుతూ దాన్ని సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాం. లేకుంటే ఏంచేయాలన్నది తగిన సమయంలో నిర్ణయిస్తాం’’ అని పేర్కొన్నారు. మీడియా స్వతంత్రతను తాము గౌరవిస్తామని, అలాగని హద్దులు మీరడం న్యాయం కాదని జస్టిస్ హిమా కోహ్లీ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల