Azadi Ka Amrit Mahotsav: కోల్కతా నుంచి దిల్లీకి మార్చి..
బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశ రాజధాని మార్పు ఒకింత కలకలం సృష్టించింది. లార్డ్ కర్జన్లాంటి అనేక మంది వద్దని చెప్పినా... 1911లో రాజధానిని కోల్కతా నుంచి దిల్లీకి మార్చారు. భారత్లో తమ
బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశ రాజధాని మార్పు ఒకింత కలకలం సృష్టించింది. లార్డ్ కర్జన్లాంటి అనేక మంది వద్దని చెప్పినా... 1911లో రాజధానిని కోల్కతా నుంచి దిల్లీకి మార్చారు. భారత్లో తమ పాలనను శాశ్వతంగా పదిల పర్చుకోవటానికి దిల్లీ కేంద్రమైతే బాగుంటుందనుకున్నారు. కానీ కొత్త దిల్లీ ఉదయించిన కొన్నాళ్లకే... బ్రిటిష్ సామ్రాజ్యంపై రవి అస్తమించించటం యాదృచ్ఛికం!
భారత్లో అడుగుపెట్టిన నాటి నుంచీ కోల్కతా కేంద్రంగా పాలించిన ఆంగ్లేయులు... అక్కడే తమ ముద్రలన్నీ వేశారు. భవంతుల నుంచి మొదలెడితే... చదువుల దాకా, వలస రాజ్య లక్షణాలన్నీ అడుగడుగునా కన్పించే కేంద్రంగా కోల్కతా మారింది. జాతీయ కాంగ్రెస్ రూపంలో ఉద్యమం ఆరంభమైనా... తమ విభజించు పాలించు సూత్రం ముందు అదేమంతగా ఆందోళన చెందాల్సిన అంశంగా వారికి కనిపించలేదు. భారత్లోని పీత రాజకీయాలు, మతాలు, కులాల రూపంలో తమకు అందుబాటులో ఉన్న ‘విభజన’ అవకాశాలు- తెల్లవారిలో ధైర్యాన్ని నింపాయి. భారత్ను శాశ్వతంగా ఏలటానికి ఎత్తుగడలు వేశారు. అందులో భాగంగా రాజధానిని కోల్కతా నుంచి దిల్లీకి మార్చారు.
వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ ఇందుకు ముందస్తు ఏర్పాట్లు చేశాడు. 1911లో బ్రిటన్ చక్రవర్తి జార్జ్-5 గౌరవార్థం దిల్లీలో ఘనంగా దిల్లీ దర్బార్ ఏర్పాటు చేశారు. అంతకుముందు కూడా మూడుసార్లు దర్బార్లు జరిగినా... బ్రిటన్ చక్రవర్తి స్వయంగా హాజరవటం ఇదే తొలిసారి. ఆ సందర్భంగానే... 1911 డిసెంబరు 12న చక్రవర్తి జార్జ్ ఉన్నట్టుండి రాజధాని మార్పును ప్రకటించారు. ఇకమీదట భారత్లో బ్రిటిష్ పాలన కోల్కతా కాకుండా దిల్లీ నుంచి జరుగుతుందంటూ ఆయన చేసిన ప్రకటన యావద్దేశాన్ని ఆశ్చర్యంలోకి నెట్టేసింది. ఆంగ్లేయుల్లోనూ చాలామంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బెంగాల్ను విభజించిన వైస్రాయ్ లార్డ్ కర్జన్ బహిరంగంగానే తన అసంతృప్తిని ప్రకటించాడు. ‘‘కోల్కతా నుంచి బ్రిటిష్ పాలనను దిల్లీకి మార్చటం ప్రభుత్వానికి ప్రమాదకరమని భావిస్తున్నాను’’ అని హెచ్చరించాడు కూడా!
స్వపక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమైనా... భారత్లో తమ అధికార స్థిరత్వానికి రాజధాని మార్పు కీలకమని బ్రిటన్ ప్రభుత్వం బలంగా నమ్మింది. మొఘలుల నాటి నుంచి రాజధానిగా ఉండటం వల్ల దిల్లీ రాజకీయ వాతావరణం కూడా అందుకు అనువుగా ఉంటుందనుకుంది. భారత్పై సుదీర్ఘ పట్టుకు దిల్లీ నుంచి పాలన తోడ్పడుతుందనుకుంది. బెంగాల్లో విప్లవవాదం పెరగటం కూడా తెల్లవారికి కాసింత చికాకుగా మారింది. వెరసి... ఇవన్నీ కలసి దిల్లీ దిశగా నడిపించాయి.
దర్బార్లో ప్రకటన వెలువరించిన వెంటనే... చక్రవర్తి జార్జ్, రాణి మేరీలు... కొత్త రాజధానికి శంకుస్థాపన కూడా చేసేశారు. నాలుగేళ్లలో కొత్త దిల్లీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ తొలి ప్రపంచ యుద్ధంతో... నిధులు కేటాయించలేక పని సాగిలపడింది. ఫలితంగా... 1931 నాటికిగాని కొత్త దిల్లీ నిర్మాణం పూర్తికాలేదు. సరికొత్త భవంతులు, పట్టణ నిర్మాణంతో భారత్పై తమ పట్టు ఇప్పట్లో తొలగేది కాదని ఆంగ్లేయులు పరోక్షంగా సంకేతాలు పంపించారు. కొన్నేళ్ల తర్వాత లండన్లో జరిగిన ఓ సమావేశానంతరం... జవహర్లాల్ నెహ్రూ... అప్పటి వైస్రాయి లార్డ్ లిన్లిత్గోల మధ్య వాడీవేడీ సంవాదంలో ఆ విషయం ప్రస్ఫుటమైంది. ‘చూడండి... పదేళ్లలో మేం స్వాతంత్య్రం సాధించుకొని తీరతాం’ అని నెహ్రూ ఆగ్రహంగా అనటంతో... ‘అబ్బే... అది సాధ్యంగాని పని. నేనూ మీరు బతికుండగా... మన జీవితకాలంలో భారత్కు స్వాతంత్య్రం రావటం కల్ల’ అని వైస్రాయ్ లిన్లిత్గో బదులిచ్చారు.
కానీ... చివరకు కర్జన్ హెచ్చరికే నిజమైంది. అధికారాన్ని సుస్థిరం చేసుకుందామని కొత్త దిల్లీకి మారిన కొన్నేళ్లకు... రవి అస్తమించనిదనుకున్న బ్రిటిష్ సామ్రాజ్యం... అంతరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ