Annamayya Project: విపత్తా.. వైఫల్యమా?
అన్నమయ్య, పింఛ జలాశయాల వరద కట్టలు తెగిపోయి పెను విధ్వంసం జరిగిన ఘటనపై ఇంటా బయటా పెనుదుమారం రేగింది. ఈ విషయంలో యంత్రాంగం వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోగా.. ప్రాణనష్టమూ సంభవించింది. కేవలం రెండు, మూడు గంటల్లోనే వచ్చిన అనూహ్య వరద.. ప్రకృతి విపత్తు వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నది అధికారవర్గాల వాదన. కానీ, జలవనరుల రంగంలో ఉన్న నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సామర్థ్యానికి మించిన వరదతోనే డ్యాంలు తెగిపోవని, నిర్వహణ వైఫల్యాలు కూడా తోడవడమే ఈ పెను ప్రమాదానికి కారణమని వారు అంటున్నారు.
అన్నమయ్య, పింఛ కట్టల విధ్వంసంతో పెను నష్టం
భారీ వరదే కారణమని అధికార వర్గాల వాదన
అన్నమయ్య జలాశయాన్ని ముందే ఎందుకు ఖాళీ చేయలేదు?
జల వనరుల రంగ నిపుణుల ప్రశ్నలు
ఈనాడు - అమరావతి
అన్నమయ్య జలాశయం కట్టతెగిన ప్రాంతం
అన్నమయ్య జలాశయంలో నవంబరు 18 రాత్రి 8.30 సమయంలో 1.590 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఒక గేటు పని చేయకపోయినా 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపవచ్చు. మూడు రోజులు అతిభారీ వర్షాలని ప్రభుత్వమే చెబుతోంది. 87,296 క్యూసెక్కుల ప్రవాహాలు ప్రాజెక్టులోకి వస్తున్నాయి. మరి ఆ సమయంలో 1.20 లక్షల క్యూసెక్కులే ఎందుకు వదిలారు? అదేరోజు అర్ధరాత్రి ప్రాజెక్టులో నీటి నిల్వ 1.805 టీఎంసీలకు పెరిగింది. మరోవైపు ప్రాజెక్టులోకి 1.71లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుంటే 1.46 లక్షల క్యూసెక్కులే ఎందుకు వదిలారు? భారీ వరద వస్తున్నప్పుడు జలాశయంలో నీటి నిల్వ పెంచేలా ప్రాజెక్టు గేట్ల నిర్వహణ చేయడం ఏమిటి? ఆ తర్వాత రెండు మూడు గంటలకు కట్ట కొట్టుకుపోతే దీన్ని ప్రకృతి విపత్తు అనాలా? ప్రాజెక్టు నిర్వహణలో లోపం అనాలా? అన్న చర్చ సాగుతోంది.
అన్నమయ్య, పింఛ జలాశయాల వరద కట్టలు తెగిపోయి పెను విధ్వంసం జరిగిన ఘటనపై ఇంటా బయటా పెనుదుమారం రేగింది. ఈ విషయంలో యంత్రాంగం వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోగా.. ప్రాణనష్టమూ సంభవించింది. కేవలం రెండు, మూడు గంటల్లోనే వచ్చిన అనూహ్య వరద.. ప్రకృతి విపత్తు వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నది అధికారవర్గాల వాదన. కానీ, జలవనరుల రంగంలో ఉన్న నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సామర్థ్యానికి మించిన వరదతోనే డ్యాంలు తెగిపోవని, నిర్వహణ వైఫల్యాలు కూడా తోడవడమే ఈ పెను ప్రమాదానికి కారణమని వారు అంటున్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వరదల సమయంలో చూపించాల్సిన అప్రమత్తత విషయంలో అలక్ష్యం కూడా ప్రధాన కారణమని వ్యాఖ్యానిస్తున్నారు.
వాదన 1: కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నవంబరు 16, 17, 18 తేదీల్లో కుండపోత వర్షాలు కురిశాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడ్డాయి. భారీ వరద ముంచెత్తడంతో, ప్రకృతి విపత్తు వల్ల ఈ ప్రాజెక్టులకు ప్రమాదం సంభవించింది.
నిపుణుల చర్చ: మూడు రోజులు అతి భారీవర్షాలు కురిశాయని ప్రభుత్వమే చెబుతోంది. అన్నమయ్య జలాశయానికి పైన బాహుదా, పింఛ, మాండవ్య మీదుగా నీటి ప్రవాహాలుంటాయి.
ఆ మూడు కలిసిన చెయ్యేరు మీదే అన్నమయ్య జలాశయం ఉంది. అతి భారీవర్షాల వల్ల వరద వస్తుందని ఇంజినీరింగు అధికారులు అంచనా వేయగలరు. ఆ పరీవాహకంలో ఎక్కడ ఎంత వర్షం పడిందో లెక్కలూ అందుబాటులో ఉంటాయి. భారీవర్షాలు ప్రారంభమైన మూడోరోజు అర్ధరాత్రి తర్వాత రెండు జలాశయాల కట్టలు తెగాయి. అన్నమయ్య జలాశయంలో నిల్వ ఉన్న 1.590 టీఎంసీల నీటిని ముందే ఖాళీ చేసి వరద నీటిని నింపేందుకు సిద్ధంగా ఉండాలి కదా? అలా ఎందుకు చేయలేదన్నది జలవనరుల నిపుణుల ప్రశ్న.
వాదన 2: అన్నమయ్య స్పిల్ వే ప్రవాహ సామర్థ్యం 2.25 లక్షల క్యూసెక్కులు. వచ్చిన వరద 3.20 లక్షల క్యూసెక్కులు. ఇలా ఎక్కువగా రావడం వల్లే కట్టలు కొట్టుకుపోయి ప్రాణనష్టం సంభవించింది.
నిపుణుల అభిప్రాయం: 2009 అక్టోబరులో శ్రీశైలం జలాశయంలో ఎదురైన అనుభవం తెలిసిన వారెవరైనా ఈ వాదన సరైనదే అనగలరా? 2009 అక్టోబరులో శ్రీశైలం జలాశయానికి అనూహ్య స్థాయిలో వరదలు వచ్చాయి. శ్రీశైలం జలాశయం స్పిల్ వే సామర్థ్యం 15 లక్షల క్యూసెక్కులు. వచ్చిన వరద 25 లక్షల క్యూసెక్కులు. శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న రక్షణ కట్ట దాటి పైనుంచి నీరు పొర్లిపోయే పరిస్థితి. దిగువన నాగార్జునసాగర్ నిండు కుండలా ఉంది. విజయవాడకు పెను ప్రమాదం ఉన్న నాటి పరిస్థితిలో జలాశయాన్ని కాపాడుకోగలమా లేదా అన్న భయాల మధ్య జలవనరులశాఖ అధికారులు ముందుజాగ్రత్తలతో ఆ ప్రమాదం నుంచి గట్టెక్కించారని నిపుణులు గుర్తుచేశారు. అప్పట్లో అంతలా చేసినా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఎదుర్కోవలసి వచ్చిందనీ అన్నారు.
సకాలంలో నిర్ణయాలు ఏవీ?
అన్నమయ్య జలాశయాన్ని ఖాళీ చేసే విషయంలో, గేట్లు ఎత్తే విషయంలో జలవనరులశాఖ అధికారులకు.. రెవెన్యూ అధికారులకు మధ్య సమన్వయ లోపం కనిపించింది. కొందరు ఉన్నతాధికారులు అక్కడి జలవనరులశాఖ అధికారులను వివరణ కోరగా.. ప్రవాహాల తీరుపై రెవెన్యూ అధికారులకు వర్తమానం పంపామని, ముందస్తు అనుమతి లేకుండా జలాశయాలు ఖాళీ చేయొద్దని మౌఖిక ఆదేశాలు ఉండటంతో రెవెన్యూ అధికారుల అనుమతి కోసం ఎదురు చూశామన్నారు. అంతే కాదు.. రెవెన్యూ అధికారులకు జలవనరులశాఖ స్థానిక అధికారులు పంపిన సందేశాల ప్రతులనూ ఉన్నతాధికారులకు సమర్పించారు. సకాలంలో ప్రాజెక్టులు ఖాళీ చేసేందుకు నిర్ణయం తీసుకోకపోవడమూ ఒక కారణంగా నిపుణులు వాదిస్తున్నారు.
ప్రాజెక్టుల నిర్వహణలో జాగ్రత్తలు ఏవీ?
ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు.. నిర్వహణ కూడా అంతే ముఖ్యం. అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులకు గతేడాది నవంబరులో వచ్చిన వరదలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నమయ్యలో అయిదో గేటు పని చేయట్లేదు. మరమ్మతు పనుల కోసం రూ.4 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లినా, నిధులు మంజూరు కాలేదు. అప్పుడు దెబ్బతిన్న ప్రాజెక్టు మరమ్మతులకు రూ.4 కోట్లు కూడా ఇవ్వలేరా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!