
తాజా వార్తలు
తెగిన ఓహెచ్ఈ తీగ
కేసముద్రం : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్ఈ (ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్ వెళ్లే కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. గురువారం రాత్రి 9.40 గంటలకు కేసముద్రం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ ఇంటికన్నె రైల్వేస్టేషన్ సమీపిస్తుండగా ఇంజిన్పై యాంటెనా, ఓహెచ్ఈ తీగకు అనుసంధానంగా ఉన్న జంపర్ తెగిపోయి రైలు బోగీకి తగిలింది. దీంతో ఒక్కసారిగా మంటలు, పొగలు బోగీలోకి కమ్ముకోవడంతో ప్రయాణికులు భయపడ్డారు. కదులుతున్న రైలు నుంచి కొందరు ప్రయాణికులు దూకేందుకు ప్రయత్నం చేయగా అప్రమత్తమైన యువకులు వారిని అడ్డుకొని చైౖన్ లాగారు. నిలిచిన రైలు నుంచి ప్రయాణికులు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు పెట్టారు. ప్రాణాపాయం లేకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఖాజీపేట జంక్షన్ నుంచి డీజిల్ ఇంజిన్ను రప్పించి కొల్హాపూర్ ఎక్స్ప్రెస్కు తగిలించడంతో రాత్రి 1.15 గంటలకు రైలు కదిలింది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్గోయింగ్ కాల్స్పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ట్రాఫిక్లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
