
తాజా వార్తలు
హైదరాబాద్: ‘భయపడేవాడే బేరాలకొస్తాడు. మన దగ్గర బేరాల్లేవమ్మా..’ అని అంటున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆయన కథానాయకుడి నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్స్టార్ అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్న ఈ చిత్ర టీజర్ శుక్రవారం విడుదలయ్యింది. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేశ్ అదరగొట్టారు. ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్’ అంటూ ప్రొఫెసర్ భారతి పాత్రలో విజయశాంతి చెప్పిన డైలాగ్ హృదయాలను హత్తుకునేలా ఉంది. అలాగే టీజర్ చివర్లో ‘ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు.’ అని మహేశ్ను ఉద్దేశిస్తూ ప్రకాశ్రాజ్ చెప్పిన డైలాగ్ అభిమానులతో విజిల్స్ వేయిస్తోంది.
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి మాస్, ఎంటర్టైనర్గా తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఆర్మీ అధికారి అయిన మహేశ్కు కర్నూలులో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే! దిల్రాజు, మహేశ్బాబు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రజనీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి
- రాహుల్కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్
- పౌరసత్వ చట్టంతో కాంగ్రెస్కు కడుపునొప్పి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
