
తాజా వార్తలు
ముంబయిలో దాడి చేశాం..పురస్కారం ఇవ్వండి
పాక్ను కోరిన దాడుల కుట్రదారు తహవుర్ రానా
వాషింగ్టన్: భారత్లో దాడి చేసి అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నందుకు తనకు అత్యున్నత పురస్కారం కావాలని పాక్ ప్రభుత్వాన్ని కోరాడట తహవుర్ రానా. అలాగే ఆ మారణహోమంలో పాల్గొన్న తొమ్మిది మంది ముష్కరులకు ఏకంగా పాక్ అత్యున్నత సైనిక పురస్కారాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. ఈ విషయాల్ని అమెరికా ప్రభుత్వం అక్కడి కోర్టుకు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..
భారత్లో 2008నాటి ముంబై ఉగ్రదాడుల ఘటనలో దోషి అయిన పాకిస్థాన్ సంతతి కెనడా వ్యాపారి తహవుర్ రానా ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజెలస్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఉగ్రదాడుల కేసు నిమిత్తం అతణ్ని తమకు అప్పగించాలన్న భారత్ అభ్యర్థన మేరకు రానాను జూన్ 10న అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కోర్టులో సమర్పించిన ఛార్జిషీట్లో అటార్నీ నికోలా టీ హన్నా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దాడుల్లో రానా హస్తమున్నట్లు ధ్రువీకరించిన హన్నా.. ఆ ముష్కరుణ్ని తమకు అప్పగించాలన్న భారత అభ్యర్థనను సమర్థించారు.
ఛార్జిషీట్లోని వివరాల ప్రకారం.. ‘‘రానా, దాడుల్లో మరో కుట్రదారుడు హెడ్లీ, లష్కరే ముష్కరులు సహా మరికొంత మంది దుండగులు కలిసి చేసిన కుట్ర నవంబరు 26, 2008లో ముంబయిలో దాడులకు దారితీసింది. దాడి జరిగిన తర్వాత కూడా హెడ్లీ, రానా తరచూ సంప్రదింపులు జరుపుకొన్నారు. దాడి జరిగిన ప్రదేశాల్ని వీడియో తీయడంతో పాటు డిసెంబరులో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని రానాకు హెడ్లీ తెలియజేశాడు. ఇలా ఇరువురి మధ్య పలుసార్లు సంభాషణలు కొనసాగాయి. ఈ క్రమంలో వీరి సంభాషణల్ని అమెరికన్ ఎఫ్బీఐ ఛేదించింది. దాడుల్లో మృతిచెందిన 9 మంది ఉగ్రవాదులకు పాకిస్థాన్ అత్యున్నత సైనిక పురస్కారం.. తనకు దేశ అత్యున్న పౌర పురస్కారాల్లో ఒకటి ఇవ్వాలని రానా డిమాండ్ చేయడాన్ని ఎఫ్బీఐ స్పష్టంగా విన్నది. ఈ విషయాన్ని హెడ్లీ అప్పటికే పాక్లోని తమ సభ్యులకు తెలియజేసినట్లు చెప్పడంతో రానా చాలా సంతోషించాడు’’ అని హన్నా తెలిపారు.
ముంబయి దాడుల తర్వాత కూడా వారి కుట్రలు కొనసాగినట్లు హన్నా వెల్లడించారు. 2009లోనూ భారత్లో దాడులు చేయడానికి ప్రయత్నించగా.. విఫలమైనట్లు తెలిపారు. ఈ మేరకు అప్పటికే హెడ్లీ తనిఖీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. డెన్మార్క్లోనూ దాడులకు ప్రయత్నించినట్లు చెప్పారు. 2009, అక్టోబర్ 3న హెడ్లీ షికాగోలో అరెస్టయిన విషయం తెలిసిందే. ఆరునెలల తర్వాత హెడ్లీ నేరాల్ని అంగీకరించాడు. అమెరికా ప్రభుత్వానికి విచారణలో సహకరిస్తానని ఒప్పుకొన్నాడు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇల్లినాయిస్ కోర్టు అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
రానా వ్యాపారాలను అడ్డం పెట్టుకొని హెడ్లీ వివిధ దేశాలకు సునాయసంగా ప్రయాణించినట్లు హన్నా వెల్లడించారు. సెప్టెంబరు 2006లో రానా వ్యాపారాల ప్రారంభం నెపంతో భారత్లోకి అడుగుపెట్టిన హెడ్లీ.. పలుసార్లు తన వీసాను పొడిగించుకొన్నాడు. తాజ్ హోటల్ సహా పలు ప్రాంతాల్ని స్పష్టంగా వీడియో తీశాడు. అనంతరం పాక్ వెళ్లి లష్కరే మూకలకు చూపించాడు. వారి సూచనల ప్రకారం.. 2007, ఫిబ్రవరిలో భారత్కు వచ్చి మరోసారి ఆయా ప్రాంతాలపై గట్టి నిఘా వేశాడు. ఈ మేరకు పూర్తి వివరాలను హన్నా ఛార్జిషీట్లో వివరంగా తెలిపారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
