
తాజా వార్తలు
8వ తేదీన భారత్ బంద్
ఇంటర్నెట్డెస్క్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్రం కానుంది. ఈ నెల 8వ తేదీన భారత్ బంద్ పాటించాలని రైతు సంఘ నాయకుడు హర్వీదర్ సింగ్ లడ్క్వాల్ పిలుపునిచ్చారు. ‘‘కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరాము. ఐదో తేదీన దేశవ్యాప్తంగా ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేస్తాము. డిసెంబర్ 8వ తేదీన భారత్ బంద్ పాటించాలని పిలుపునిస్తున్నాము’’ అని భారతీయ కిసాన్ యూనియన్ లోఖోవాల్ జనరల్ సెక్రటరీ హర్వీదర్ సింగ్ తెలిపారు. ఆయన ఆంగ్ల వార్త సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు.
దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతలు చేపట్టిన ఆందోళన వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. రైతుల నిరసనతో కొవిడ్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున వారిని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఓం ప్రకాశ్ పరిహార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన నేటితో తొమ్మిదో రోజుకు చేరింది. కొత్త చట్టాలపై రైతు సంఘాలు, కేంద్రం ఇప్పటికే రెండు విడతల్లో చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కిరాలేదు. దీంతో చర్చలను శనివారానికి వాయిదా వేశారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- ముక్క కొరకలేరు!
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
