
తాజా వార్తలు
వ్యాక్సిన్పై అపోహలు వద్దు: గవర్నర్
తిరుమల: తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ... కరోనా వ్యాక్సిన్ కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా మన శాస్త్రవేత్తలే తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు. వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు లేకుండా అందరూ తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి...
తెలంగాణలో కొత్తగా 197 కరోనా కేసులు
Tags :