
తాజా వార్తలు
గవర్నర్ జోక్యం చేసుకోవాలి: యనమల
అమరావతి: జగన్ ముఖ్యమంత్రి అయ్యాక యదేచ్ఛగా అన్నీ ఉల్లంఘనలేనని శాసనమండలిలో ప్రతిపక్షనేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అధికార యంత్రాంగాన్ని జగన్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అన్ని వర్గాల హక్కుల అణచివేతే జగన్ అజెండా అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిణామాలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గవర్నర్ కాపాడాలని, రాజ్యాంగ బద్ధ పాలన జరిగేలా చూడాలని యనమల కోరారు. జగన్ తుగ్లక్ చర్యలకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు.
ఇవీ చదవండి...
ఎన్నికలపై ఎస్ఈసీకి నమ్మకం లేదు: వెంకట్రామిరెడ్డి
కేటీఆర్ మెచ్చిన ఈ కుర్రాడి టాలెంట్ చూశారా..?
Tags :