
తాజా వార్తలు
అంబులెన్స్కైనా దారివ్వండి..!
కరీంనగర్: ప్రజల అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెస్తోంది. చాలా గ్రామాల్లో బయటవారు తమ గ్రామంలోకి రాకుండా, గ్రామస్థులు బయటకు వెళ్లకుండా కర్రలు, రాళ్లు, ముళ్ల కంచెలు రోడ్డుకు అడ్డంగా పెడుతున్నారు. పట్టణాల్లోని చాలా వీధుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇతరులు తమ గ్రామంలోకి రాకపోతే కరోనావైరస్ వ్యాపించదనే నమ్మకంతో వారు ఇలా చేస్తున్నారు. కానీ, ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్లాల్సిన అంబులెన్స్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నాయి. ఎవరి ప్రాణాలో ప్రమాదంలో ఉంటే రక్షించడానికి వెళ్లే వాహనాలు కూడా వెళ్లకుండా చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారంలో గ్రామంలోకి ఎవరూ రాకుండా గ్రామస్థులు ముళ్ళకంచెలు వేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆ మార్గంలోకి వచ్చిన 108 అంబులెన్స్ చిక్కుకుపోయింది. ముళ్ళ కంచె వేయడం సరికాదని అవసరమైతే కర్రలతో టెన్షన్ ఏర్పాటు చేసుకోవాల్సిందని అంబులెన్స్ సిబ్బంది వాపోయారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- మహేశ్బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- రోహిత్ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- సికింద్రాబాద్లో భారీగా బంగారం చోరీ
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
