
తాజా వార్తలు
తెలంగాణలో కొత్తగా 602 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 24,139 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 602 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,64,128కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,433కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 1,015 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,51,468కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,227 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 8,942 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 51,58,474కి చేరింది.
Tags :
జనరల్
జిల్లా వార్తలు