
తాజా వార్తలు
ఉప్పల్ అభివృద్ధికి ఎంత ఖర్చుచేశారు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ రేవంత్ రెడ్డి
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఉప్పల్ డివిజన్లో తెరాస నాయకులు బాగా పనిచేస్తే పాత కార్పొరేటర్ను మార్చి కొత్త అభ్యర్థిని ఎందుకు తెచ్చారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. భాజపా, తెరాస నాయకులు పాము, ముంగీస ఆటలాడుతూ ప్రజలను మాయ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉప్పల్ డివిజన్లోని పలువురు తెరాస కార్యర్తలు కాంగ్రెస్ అభ్యర్థి రజితా పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. హైదరాబాద్ అభివృద్ధికి రూ.67వేల కోట్లు ఖర్చు చేశామంటున్న మంత్రి కేటీఆర్.. ఉప్పల్ డివిజన్లో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Tags :
జిల్లా వార్తలు