
వీడియో వైరల్
హైదరాబాద్: కథానాయకుడు ఎన్టీఆర్ తన హాస్య చతురతతో మరోసారి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన నటిస్తున్న సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ మహాబలేశ్వర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రాజమౌళి, ఎన్టీఆర్తోపాటు చిత్ర బృందం హైదరాబాద్కు చేరుకుంది. ఈ క్రమంలో విమానాశ్రయంలో తీసిన వీడియో, ఫొటోలు వైరల్గా మారాయి. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్ తారక్ చిత్రాలు గ్యాప్ లేకుండా క్లిక్ మనిపించారు. దీన్ని గమనించిన యంగ్టైగర్ ఆయనతో సంభాషించారు. ‘పనిలేదా ఇంక.. ఎప్పుడూ ఇదే పనా నీకు..’ అని జోక్ చేశారు. దీనికి అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్తోపాటు అందరూ నవ్వారు. అంతేకాదు తారక్ కారువైపునకు నడుస్తూ.. ఫొటోగ్రాఫర్ను దగ్గరికి పిలిచి మాట్లాడారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఇక్కడేనా? అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘ఆర్.ఆర్.ఆర్’లో కొమరం భీమ్గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రియ, అజయ్ దేవగణ్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్తో తీస్తున్న ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ చిత్రం 50 రోజుల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి
- అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
- నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్
- అట్టుడుకుతున్న రష్యా!
- భారత్తో పోల్చాలంటే భయమేస్తోంది: ఛాపెల్
- టిక్టాక్ స్టార్ ఆత్మహత్య
- పంత్ వచ్చి టీమ్ ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు
- మేం గెలవడానికి కారణం టిమ్పైనే..
- వేదికపై కళ్లు తిరిగిపడిపోయిన డైరెక్టర్
- ఏపీ ప్రభుత్వం పిటిషన్: విచారణ బెంచ్ మార్పు