
తాజా వార్తలు
ఆకట్టుకునేలా ‘ఐఐటీ కృష్ణమూర్తి’ పాట
హైదరాబాద్: యువ నటీనటులు పృధ్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటించిన విభిన్న కథా చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి’. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీ వర్ధన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే, ‘ఐఐటీ కృష్ణమూర్తి’ చిత్రాన్ని డిసెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ను చిత్రబృందం విడుదల చేసింది. ‘మేఘంతో మేఘం మురిసే’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
Tags :
సినిమా
జిల్లా వార్తలు